ఋషులు సూత పౌరాణికుని ప్రార్థించి వామదేవుడు సనత్కుమారునిద్వారా వినిన శివరహస్య మేమని అడిగిరి. సూతుడిట్లు చెప్పిరి. సనత్కుమారుడు వామదేవుని మహాత్మా! మీ దివ్య పరిజ్ఞానముల పాపములంది మిక్కిలి గొప్ప పాపము, ఎట్టి కర్మలవల్లనూ నివృత్తి గాని పాపమేది యని అడిగిరి. శివాపరాధమునకు మించిన పాపము, ఎట్టి పుణ్యకార్యములవల్లనూ రహితము గాది. పదివేల ప్రాయశ్చిత్తముల వల్లనూ అట్టి పాపము ప్రక్షాళితముగాదు. అనగా సనత్కుమారులిట్లు తెల్పిరి. కలియుగము పాప భూయిష్టము. పాపభీతి గలవారు తక్కువ. ఉచితానుచితములు తలంపరు. కేవలము ఇంద్రియ, జిహ్వ సుఖ నిరతులు. సత్య, త్రేతా, ద్వాపర యుగములందు ధర్మలోపము లేదు. కలియుగమున మానవులు కుటిలాత్ములై అధర్మపురలగుట వలన శంకరుని కృపలేనిదే వారు తరించు మార్గము లేనందున దయామయుడై శంకరుడు కాశీలో విశ్వనాథుడుగా, గంగ, మణికర్ణికలను పాప ప్రాయశ్చిత్తార్మేర్పరచి, తన యడల, తన భక్తులయడల చేయు అపరాధముల నివృత్తికై తానే కేదారేశ్వరుడై ఈ రహస్యమును మొదట గౌరీదేవికి చెప్పెను. కనుక శివాపరాథ, శివభక్తాపరాథ నివారణ కేవలము ప్రాచీన మణికర్ణిక, గుప్త తీర్థము మాత్రమే. అంతియేగాక తన చుట్టూగల తన అంతర్గ్రుహమున భైరవదండనయునూ లేక పాపులను గూడ తారకమంత్రముచే ముక్తులను చేయుచున్నాడు.
వేరెక్కడనూ పదివేల కల్పములయిననూ తీరని శివాపరాధము కాశీలో ఆజన్మయందే ఉపశమించి ముక్తి గల్గుట తథ్యము. కాశీకేదారునికి ఒక్క బొట్టు గంగాజలము, ఒక్క పుష్పము సమర్పించినవారికి మోక్షద్వారములు తెరుచుకొనును. ఒక దీపము వెలిగించినవారికి జ్ఞానదీపముచే అవిద్య తొలగును. ధూపమిడినవారికి జన్మజన్మాంతరముల కర్మవాసలము దుర్గంధము వీడిపోవును. మంత్రయుక్త పూజనాచరించిన వారిని కేదారేశ్వరుడు ముక్తినొసంగును. ఛత్ర, చామరాది సర్వష్డశోపచారములు చేసినవారిని రుద్ర కన్యలు సపర్యలు చేయుదురు. మహాపూజ చేసిన వారిని రుద్ర గణములు పూజింతురు. కేదారాలయమున భిక్షులకు అన్నపానీయములిచ్చినవారు శంకరుని దయాసముద్రమున తేలియాడుదురు. జీవితమున ఒక్కమారయినను కాశీ కేదారనాథుని పూజించినవారు పునరావృత్తి రహితులగుదురు. వీభూతి రుద్రాక్షధారులై రుద్ర పాఠమాచరించిన వారు అంబికా సహిత శివదర్శనము పొంది శివపదము చేరుదురు. శివ, కేదార, కేదార, కేదార యను ధ్వని మొక్షలక్ష్మితలుపులు తట్టు ధ్వని యగును. ఇది శృతి, స్మృతులవచనము. ఎట్టి సందియమును లేదు. అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, మధుపర్కముల మంత్ర ధ్వని అట్టివానిని దేవతను తమలోకములకు తీసికొని వెళ్ళుటకు చేయు భేరీధ్వనియగును. కేదారేశ్వరుని ఎదురుగా పురాణము చెప్పువారు, చెప్పించువారు, వినువారు మోక్షలక్ష్మి తమను వరించుటకు వచ్చునపుడు కాలియందియల ధ్వనిగా తలంచవలయును. కేదారము నాల్గు ప్రక్కల ఉన్నవారిని ఒక్క గ్రాసము ఆతిథ్యమునకు పిలుచు ధ్వని ఆతిథ్యమిచ్చు వారిని కైలాసమునకు ఆహ్వానించు ధ్వనిగా తలంచవలయును. కేదారేశ్వరుని స్తోత్రమంత్ర ధ్వని వారనిని కైలాసము తీసికొనివెళ్లునపుడు చేయు భేరీ భజంత్రీల ధ్వనిగా తలచవలయును. కేదారేశ్వరుని పూజించు భాగ్యమునకు నోచుకొననివారు విశ్వేశ్వర సారూప్యము బొందుదురు. ఇందు సందేహము లేనేలేదు. కేదారేశ్వరుని చుట్టునూ అగణిత లింగసమూహము గలదు. అవి దేవ, దానవ, దైత్య, నాగ, రాక్షస, అకుర, రాజ, మునివర్యులు, అప్సరసలు స్థాపించినవి. ఇవి ఐశ్వర్య, భుక్తి, ముక్తులనొసగునవి. కేదారేశ్వరునికి తూర్పున శ్రీకరకంఠ నామముతో సముద్రుడు స్థాపించినది, దానికి తూర్పున మయూర లింగము, వరుణ, సింహ, జారవ్య, మాయేశ లింగములు గలవు. ఇవి కొన్ని లుప్తములు, కొన్ని అదృశ్యములు.
కశ్యపుని కుమారులు శూరాదులు కార్తికేయునిచే నిహతులై స్వామి అనుగ్రహమున శిఖి, కాలజ్ఞాని అనుపేర్లతో స్వామివారి వాహనము, ధ్వజముగాను, తారకాసురుడు పూర్వ జన్మ తపోబలముచే స్వామి గజవాహనముగాను, అమ్మవారి సింహవాహనముకూడ పూర్వ జన్మ తపోవిశేషమున గల్గినదే. వీరి సోదరి అజ నామకురాలు, తల్లి మాయాదేవి కూడ శంకరుని విరోధించి స్కందుని ఆగ్రహమునకు గురై మరల వారి ప్రార్థనల నాలకించి కాశీలో ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి విధి విధానముగా కేదారేశ్వరుని పూజించి, వారి పేర్లతో లింగములు స్థాపించి పాపరహితులై మరల కార్తికేయుని దర్శించి, అమ్మవారిని ప్రార్థించి శివాజ్ఞచే ముక్తులైరి. వారి కుమారులు కూడా ఉపాసనా ఫలముగా వారి ఇష్టదేవతల పేర లింగములు స్థాపించిరి. మరియు నాల్గు వర్ణముల స్త్రీ, పురుషులు స్థాపించిన లింగములును గలవు. గౌరీతీర్థమున గౌరీదేవి, లక్ష్మి, వ్యాస, భార్గవులు స్థాపించిన లింగములు గలవు. సనత్కుమార, గంగ, యుము, సరస్వతులు స్థాపించిన లింగములు త్రినదీశ్వర నామములతో గలవు. ఈ విధముగా పదివేల లింగములు గంగలోని, తీరమునను గలవు.
దక్షిణ భాగముల అసంఖ్యాక లింగములు గలవు. చిత్ర కేతు, చిత్ర రధ, చిత్రాంగద, విచిత్రక, సీత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమాన్, భరత, వానర, జాంబవంత, లంగురులు స్థాపించిన లింగములు, మహాతేజస్వి రామచంద్రుడు, అన్యరాజులు తమ నామధేయములపై లింగములు స్థాపించిరి. అట్లే పశ్చిమమున వైప్రచిత్తేశ్వర, కాలకేయేశ్వర, నిరాతక వచేశ్వర, వైరోచనేశ్వర, వల్మీకేశ్వర, తిలభాండేశ్వర, వాలకేశ్వర లింగములు, కుండేశ్వర, కుఠారేశ్వర, పరిభద్రేశ్వర, శుంభేశ్వర, నిశుంభేశ్వర, కాళీశ్వర, ప్రమథేశ్వర లింగములు స్థాపించి వారందరు శివధామము చేరిరి. ఉత్తరమున ఇంద్రద్యుమ్నేశ్వర, అధీశ్వర, నిషధేశ్వర, గణేశ్వర, క్షేమేశ్వర, వాలఖిల్యేశ్వర, నారదేశ్వర, సఖీశ్వర, అక్రూరేశ్వర, కబంధేశ్వర, పాండేయేశ్వర, క్షాళనేశ్వర, దశాశ్వమేధేశ్వర, కులేశ్వర, కుండలీశ్వర లింగములు గలవు. వీనిలో కొన్ని నష్టమయినవు. కొన్ని భిన్నమయినవి. కొన్ని స్థానభ్రంశమయినవి, కొన్ని భూస్థాపితములు, కొన్ని మాత్రమే ప్రస్తుతము తెలియబడుచున్నవి.
ఈ నామములు విన్నంత మాత్రమున ముక్తిగల్గును. విశ్వేశ్వరుడే కేదారుడుగా ఖ్యాతి గాంచినాడు. కామి, అకామి, భోగి, విరాగి, యోగులకందరకునూ ముక్తి ప్రదాయిని కాశి మాత్రమే. భోగకాములకు ముక్తినిచ్చి తనలోకమున సర్వభోగముల ననుభవింపజేయును. ఈ పురాణరహస్యముని వినినవారు శివపార్శ్వవర్తి గణములలో ఒకరుగా చేరుదురు.
Sunday, April 19, 2009
Thursday, April 16, 2009
21 వ అధ్యాయము
మునులు మరల సూతమహామునికి నమస్కరించి కాశీకేదార రహస్యమునికనూ వివరింపుడని కోరగా సూతుడిట్లు వచించిరి. మాంథాత కేదారేశ్వరుని అనేక విధములుగ స్తుతించి స్వామీ మీరు మొదట హిమాలయములందు లింగరూప దర్శనమయిన వారందరకునూ ముక్తి నొసగుచుండిరి. శివాపరాధులకు అక్కడ దర్శనమివ్వనిచ్చగించని మీరు నన్ననుగ్రహించి కాశీలో ఇక్కడ మీ దర్శన భాగ్యము ఇపుడు నాకొసంగిరి. అట్లే ఇక్కడ మీదర్శనము చేసినవారందరకును ముక్తి ప్రసాదింపుడని వేడగా, వెంటనే బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలందరునూ చేతులు జోడించి కేదారేశ్వరునకు నమస్కరించి ప్రభూ! ఇట్టి దుర్లభమగు వరము మీరు అనుగ్రహించినచో క్షణములో నీదర్శనము చేసినవారందరితో కైలాసము నిండిపోయి నరకమున యమునికి గాని ఇక్కడ భైరవునికి గాని, విష్ణు, ఇంద్రాదిదేవతలకు గాని లోకపాలకులకెవరికిని పనియుండదుగదా! మీచే ఏర్పరుపబడిన సృష్ఠి, స్థితి, లయముల నియమముననుసరించి జీవులు వారి సుకృత, దుష్కృతముల వలన స్వర్గ, నరకములు పొందుటనేర్పరచినది మీరేగదా! అట్టి వ్యవస్థ తారుమారయినచో లోకమున మానవులు పాపభీతి వదలి, సుకర్మలు చేయకనే నీ దర్శనముతో ముక్తులగుటకు ప్రయత్నింతురు. గనుక మీరు భక్తుల ననుగ్రహించుటకు గాని, మీ కేదార అంతర్గ్రుహ మందు మాత్రము పాపులకు భైరవ యాతన లేకయే ముక్తి గల్గునట్లు జేయుడని కోరిరి. మీ వరప్రభావమున అర్బుద కల్పములు బ్రహ్మలోగ, విష్ణులోకములలో భోగములనుభవించి పునరావృత్తి రహిత శివధామ ప్రాప్తి నొసగుడని వేడిరి. అపుడు పరమాత్మ ప్రసన్నుడై మాంథాతా! నీవు నా ప్రియ భక్తుడవు గనుక చెప్పుచున్నాను వినుము. కారణాంతరములచే ఇక్కడ నా దర్శనమాత్రమున ముక్తి నీయజాలను. మొదటి మూడు యుగములలో మనుష్యులు ధర్మవంతులుగ నుందురు గనుక ముక్తి సాధ్యము. కాని కలియుగమున పాపులధికముగ నుందురు గనుక దర్శనమాత్రమున ముక్తి బొందిన యడల కర్మశ్ష అనుభవము లయమగుటచే సృష్ఠినియమలోపమగును. గనుక నిశ్చయముగ కాశీ కేదార లింగ దర్శనానంతరము దేశాంతరమున ఎక్కడ మృతి జెందినను ముక్తి తథ్యము. వేరు ఏమార్గమునను అట్టి ముక్తి లభ్యమవదు. ఈ రహస్య వాక్యముపై ధృడ నిశ్చయము గల్గిన వారికి పునరావృత్తి రహిత ముక్తి లభ్యమగును. భోగ మోక్షములు వారి కరతలామలకములు. కాశీలో దేహత్యాగము వలన ఇది నిశ్చయము. కేదారేశ్వరుడు మాంథాతతో మరియు ఇట్లు తెల్పెను. నాయీలింగము ఇపుడు పులగరూప పాషాణముగా తెలియునది. సత్యయుగమున నవరత్నమయముగను, త్రేతాయుగమున బంగారు లింగముగను, ద్వాపరమున వెండిలిగముగను, కలియుగమున ఇట్లు పాషాణముగను కన్పించును. నీచే రెండు భాగములు చేయబడినది హరిహరాత్మకము, శివ శక్త్యాత్మకము. అన్నముచే చేయబడినదగుటచే అన్నపూర్ణయగును. అన్నపూర్ణ సహితముగా నన్నర్చించుటచే వారింట అన్నమునకు సదాలోటుండదు. అంతమున నన్ను జేరుదురు. నా ఎదుట గుప్త తీర్థమునుండి 60 వేల పాతాళ లోక నాగకన్యలు నిత్యము నా దర్శన అర్చన నిమిత్తము వత్తులు. దేవలోకమునుండి అప్సరసలు, దేవతలు నిత్యము నన్నర్చించ వచ్చెదరు. గనుక కాశీ కేదార లింగము సర్వ కామప్రదము. నేను విశ్వనాథ లింగమందెట్లున్నానో అంతకన్న ఎక్కువగ ఈ లింగమందున్నాను. విశ్వనాథుని మణికర్ణిక ఎట్లో అంతకన్న ఎక్కువ మహాత్మ్యము ఈ ప్రాచీన మణికర్ణికది. ఇక్కడ ఢుంఢిరాజు, మాధవుడు, భైరవునితో పాటుగా దండపాణియు గలరు. ఇక్కడ నా అంతర్గ్రుహమున మరణించినవారు భైరవ యాతన లేకయే నా తారకమంత్రోపదేశముచే నా రూపము బొంది నన్ను చేరుదురు. అని శంకరుడు వరమిచ్చి మాంథాతను తన ధామమునకు చేరుమని చెప్పి ఆలింగమందు అదృశ్యుడాయెను. అక్కడి ఋషి పుంగవులు మాంథాతను అనేక వధముల కొనియాడిరి. మాంథాత వెంటనే విశ్వనాథ, కేదార, భైరవ, దండపాణి, ఢుండిరాజ, బిందుమాధవ, మణికర్ణికలను సేవించి పాంచభౌతిక శరీరము త్యజించెను. శివగణములతనిని విమానములో మహా కైలాసమునకు తీసికొని వెళ్ళిరి. మాంథాత విమానములో ఒకమారు కాశికి ప్రదక్షణము చేసి, హిమాలయ కేదారము వెళ్లి అక్కడ శంకరుని దర్శించి, ఒక అంశతో అక్కడ నిత్యము కేదారేశ్వరుని అర్చించు కొనగోరగా ఆకాశవాణి రూపమున పరమేశ్వరుడు అనుజ్ఞనొసంగెను. ఇట్లు కాశీకేదార శివ రహస్యమును వామదేవునకు సనత్కుమారులు వినిపించిరి.
కాశీలో కేదారనాధ మహిమ, గుప్త తీర్థముహిమ అత్యద్భుతములు. శివానుగ్రహముగల వారికి మాత్రమేవీని యందాసక్తిగల్గి కాశీదర్శింతురు. ఒక్కపర్యాయమయినను శ్రీకేదారేశ్వర దర్శనము, ధూప, దీప, నైవేద్య సేవనము జేసిన వారికి జనన మరణ భయములు ఉండవు. వారికి ముక్తి మండప ద్వారములు తెరిచి యుండును. పంచక్రోశాత్మక కాశీ పట్టణమంతయు విశ్వేశ్వర స్వరూపము. మణికర్ణిక సర్వపాప వినాశిని. ఇందు సంశయము లేదు. ఓంకారాది లింగములన్నియూ ముక్తిదాయకములు. చతుష్షష్ఠి యోగినులు గూడ ఇష్టకామ్యముల నిత్తురు. 56 వినాయకులు సిద్ధి నిత్తురు. ద్వాదశాదిత్యులు పాపహరులు. కార్తీకములో పంచ గంగా స్నానము, వైశాఖమున పంచతీర్థములు, మాఘమాసమున శూలటంకేశ్వరుని ఎదురుగా తీర్థము పాపహరము. కాశీలో అన్నదానము పాపహరము. పంచక్రోశమహాయాత్ర నిశ్చయముగ మహాపాపహరము. దండపాణి, మాధవ, ఢుండరాజ, భైరవులు పాప సంహరులు. 500 విష్ణుమూర్తులు పాప సంహారకులు. దుర్గా క్షేత్రము పాపహరము. కాశీలోని అణువణువున గల సర్వ దేవ తీర్థములు పాపహరములు. వినినెవరు వర్ణించ గలరు. విశ్వేశ్వరుడు ఓంకారేశ్వరాది ప్రతి లింగములోను 42 మహాలింగరూపములుగ వర్ధిల్లుచున్నాడు. ప్రతి క్షేత్రమందును విశేషమహిమలు గలవు. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు, ఇంద్ర, అగ్ని, రాక్షస, వరుణ, వాయు, కుబేర, సూర్య, చంద్ర, నక్షత్రమండలమందు గల ధృవ, సప్తర్షి, గ్రహ, అష్ట దిగ్గజ, తక్షక, కర్కోటకాది నాగులు, వశిష్ఠ, దూర్వాసాది బ్రహ్మర్షులు, దివోదాస, హరిశ్చంద్రాది చక్రవర్తులు, ఒకటని వివరించనలవిగాని అనేక దివ్య అనుగ్రహములు చేసి కాశియందు అనేకరూపములుగా నున్నాడు.
ఇట్లు సనత్కుమారునిచే చెప్పబడిన శివ విభూతులు భక్తిపూర్వకముగ విని వామదేవుడు మరల కుతూహలముతో శివ మహాత్మ్యమునిట్లు తెలిసికొనగోరెను.
కాశీలో కేదారనాధ మహిమ, గుప్త తీర్థముహిమ అత్యద్భుతములు. శివానుగ్రహముగల వారికి మాత్రమేవీని యందాసక్తిగల్గి కాశీదర్శింతురు. ఒక్కపర్యాయమయినను శ్రీకేదారేశ్వర దర్శనము, ధూప, దీప, నైవేద్య సేవనము జేసిన వారికి జనన మరణ భయములు ఉండవు. వారికి ముక్తి మండప ద్వారములు తెరిచి యుండును. పంచక్రోశాత్మక కాశీ పట్టణమంతయు విశ్వేశ్వర స్వరూపము. మణికర్ణిక సర్వపాప వినాశిని. ఇందు సంశయము లేదు. ఓంకారాది లింగములన్నియూ ముక్తిదాయకములు. చతుష్షష్ఠి యోగినులు గూడ ఇష్టకామ్యముల నిత్తురు. 56 వినాయకులు సిద్ధి నిత్తురు. ద్వాదశాదిత్యులు పాపహరులు. కార్తీకములో పంచ గంగా స్నానము, వైశాఖమున పంచతీర్థములు, మాఘమాసమున శూలటంకేశ్వరుని ఎదురుగా తీర్థము పాపహరము. కాశీలో అన్నదానము పాపహరము. పంచక్రోశమహాయాత్ర నిశ్చయముగ మహాపాపహరము. దండపాణి, మాధవ, ఢుండరాజ, భైరవులు పాప సంహరులు. 500 విష్ణుమూర్తులు పాప సంహారకులు. దుర్గా క్షేత్రము పాపహరము. కాశీలోని అణువణువున గల సర్వ దేవ తీర్థములు పాపహరములు. వినినెవరు వర్ణించ గలరు. విశ్వేశ్వరుడు ఓంకారేశ్వరాది ప్రతి లింగములోను 42 మహాలింగరూపములుగ వర్ధిల్లుచున్నాడు. ప్రతి క్షేత్రమందును విశేషమహిమలు గలవు. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు, ఇంద్ర, అగ్ని, రాక్షస, వరుణ, వాయు, కుబేర, సూర్య, చంద్ర, నక్షత్రమండలమందు గల ధృవ, సప్తర్షి, గ్రహ, అష్ట దిగ్గజ, తక్షక, కర్కోటకాది నాగులు, వశిష్ఠ, దూర్వాసాది బ్రహ్మర్షులు, దివోదాస, హరిశ్చంద్రాది చక్రవర్తులు, ఒకటని వివరించనలవిగాని అనేక దివ్య అనుగ్రహములు చేసి కాశియందు అనేకరూపములుగా నున్నాడు.
ఇట్లు సనత్కుమారునిచే చెప్పబడిన శివ విభూతులు భక్తిపూర్వకముగ విని వామదేవుడు మరల కుతూహలముతో శివ మహాత్మ్యమునిట్లు తెలిసికొనగోరెను.
Tuesday, April 14, 2009
20 వ అధ్యాయము
శౌనకాది మునులు సూతునిట్లడిగిరి. హే శివాజ్ఞాన నిధీ! మాంథాత సంశయ నివారణకు ఎట్టి మహాత్ముల వద్దకు వెళ్ళిరి. వారు కాశీయందు ఎట్టి నియమములనాచరింతురు? తెల్పుమనగా సూతుడిట్లు చెప్పదొడగెను. శివ రహస్యము నెఱిగిన ఆ మహాత్ములు మనసా, వాచా, కర్మణా అహరహము శివకైకర్యమున కంకితమైనవారు. సిద్ధులు, చిద్ఘములు, శివానంద సముద్రముల కెరటమువంటివారి. శివ తత్వార్ధమును తెలిసినవారు. శివునికి వలె శివభక్తులకును సేవ జేయువారు. శివ పూజా పరాయణులు. శివ పురాణమును ప్రవచించువారు. శైవ శాస్త్ర, ఆచార, తంత్రములయందారితేరినవారు. శివ ధ్యానరూపమగు తృప్తితో ప్రాపంచిక విషయములను తృణమాత్రముగ నెంయి శివజ్ఞానమను అగ్నితో భస్మము జేయువారు. మనోవేగమున నిత్యము అఖిల శివ క్షేత్రములను దర్శించనిదే భోజనము చేయనివారు. అట్టివారి సభలో మాంథాత వారికి సాష్ఠాంగ మనస్కారములు చేసి తన సంశయమును నివేదించగా వారు మాంథాతను ప్రశంసించి, నీవు ధన్యుడవు. నీ తపస్సుకు మెచ్చి కేదారేశ్వరుడు ఆకాశవాణి రూపమున నిన్నాదేశించెను. శాస్త్రోచిత నియమపాలన కన్ననూ శివాజ్ఞయే మిన్న గనుక నీవు వెంటనే వెళ్ళి స్వామికి నైవేద్యము తయారు చేయుము. మేముకూడ నీవలె మనోవేగము గలవారము. నీ స్వామ్ ఆదేశానుసారము అతిథి సేవ, భోజనము అయిన తర్వాత మేమునూ యాత్రలో నిన్ననుసరించి వచ్చెదమనిరి. మాంథాత వెంటనే తన స్థానమునకు చేరి, పులగము వండి, నేతితో కలిపి ఆకులో గుమ్మరించి, మధ్యలో గీత గీసి రెండు భాగములు చేసి శివునికి నివేదించి, అతిథి కొరకు ఎదురు చూచుచున్న సమయమున ఇతనితో యాత్ర చేయుటకు సిద్ధులందరును ఎతెంచిరి. ఎంతకును అతిథి దొరకడాయెను. కాలాతీతమగుచున్నందున మాంథాత తో చేరి అందరునూ శివుని స్తుతించిరి. వెంటనే పరమాత్మ భిక్షురూపమున వెలుపల నిలిచి నాకు భిక్షనిత్తువాయాని పిలచెను. మాంథాత సంతోషముతో భిక్షును చూచి నమస్కరించి పొంగలి భిక్ష తెచ్చుటకు లోనికి వెళ్లి అతిథి భాగమును తీయబోగా క్షణములో రెండు భాగములుని పాషాణమూగా మారినవి. మాంథాత ఆశ్చర్యముతో అతిథికి భిక్షనీయలేకపోతినే యని చింతించి, నేనేదో తప్పుచేసి యుండవచ్చును. కేదారేశ్వరుడు కోపించి యుండునని తలచి దుఃఖితుడై వెలుపలకు వచ్చి చూడగా భిక్షువు కన్పింపలేదు. శివభక్తులందరునూ వెలుపలకు వచ్చిచూడగా ఆకాశమున మాహాశంఖ నాదము, ఘంటానాదము, రుద్రకన్యల తాటంకముల ఝణఝణ శబ్దము, శివస్వరూపులగు రుద్రగణములతో, సహస్ర సూర్యకాంతులు మిరిమిట్లు గొల్పు కాంతితో, ఛత్ర, చామర సహిత, శీతల పవనముసు లీటు కఛము క్రిందకు దిగి అందుండి రుద్రగణములు, మాంథాతతో ఋషిసత్తమా కైలాసమునుండి, మీతపస్సుకు సంతృప్తుడయిన పరమ శివుడు ఈ రథమును పంపి మిమ్ము తీసికొని రమ్మనిరి. దయచేసి వచ్చి రథములో మాతోరండని ప్రార్థించిరి.
కాని మాంథాత మనసు సాక్షాత్ కేదారేశ్వరుని దర్శనము కొఱకు ఆరోటపడుచున్నందున, పరమేశ్వరుడు సగభాగమున పార్వతితో అర్ధనారీశ్వరుడుగ వృషభవాహనారూఢుడై, కార్తికేయ, గణేశ, శివగణ సహితుడై, నందీశ్వరుడు ముందు నడువగా, కోటి సూర్య ప్రకాశముతో, కోటి చంద్రుల శీతల పవన శోభతో, సరస్వతీదేవి వీణావాదన సామగానము వినపించుచుండగా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ పత్నీ సమేతులై జయజయ ధ్వానములు సల్పుచుండగా పాషాణ రూపమయిన అన్నకూటము నుండి ప్రకటితమయి, శిలా ప్రతిమవలె నిశ్చేష్టుడై నిల్చుండిన మాథాతతో స్వామి గంభీరముగా భక్తాగ్రగణ్య శిఖామణీ మాంథాతా! నీ నీశ్చల తపోనిష్టకు, భక్తి ప్రపత్తులకు నేనెంతో తృప్తుడనైతిని. వేరెవ్వరకునూ అలభ్యమగు వరములు నీకివ్వ సంకల్పించితిని గనుక నీ అభీష్టము తెల్పునమిరి. మాంథాత తెలివిలోనికి వచ్చి స్వామి ప్రసాదించిన దివ్య దృష్టితో స్వామిని దర్శించి దండ ప్రణామమాచరించి ఆనందాశ్రువులు ధారా ప్రవాహముగ రాలుచుండ, మహాదేవా! బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకే అలభ్యమగు ఇట్టి మీ సాక్షాత్కారమునకు మూఢుడనయిన నేనునూ పాత్రుడనగుట నా పూర్వజన్మల సుకృతమగును. నీ భక్తుల సత్సంగ ఫలితమగును. ప్రభో ఈ శివభక్తులందరూ నిన్నెప్పుడూ మనమునచూడ నిచ్చగించు మహాత్ములు, గనుక నాపై తమకు గల దయా దృష్ఠి వీరందరిపై యుండు గాక, ఇక రెండవ వరముగా నాకు ముక్తిగూడ కోరను. అనగా పరమ శివుడు, నీవు భక్త శిఖామణి వయితివి, నీకు వరము ఇతరుల కొఱకు కోరుటయే నీ గొప్పతనము కనుక నాయీ దివ్యదర్శన భాగ్యము కొరకు నీవు కోరినట్లు ఇక్కడి వారందరకు దివ్యదృష్ఠి నిచ్చుచున్నాను. అనగనే అక్కడి మునులందరూ బ్రహ్మాదులకే అలభ్యమగు దివ్య దర్శనము చూచి ఆనంద తాండవము చేయుచు, జయ జయ ధ్వానములతో, వేదాంత, స్మృతి, శృతి, పురాణ స్తుతులతో, రుద్ర పాఠ ఘోషతో, మోక్షలక్ష్మీ ప్రార్ధనలతో శంకరుని స్తుతించిరి. వెంటనే శంభుని ఆజ్ఞపై ఆకాశమున శంఖారావ, ఘంటానాదములు మార్మోగ నూర్లకొలది రుద్ర కన్యలు ఛత్ర చామరములు వీచుచున్న విమానములు కన్పట్టెను. అక్కడి మహాత్ములందరు వారి భౌతిక శరీరములు వదలి సూక్ష్మ శరీర ధారులై ఆ విమానముల నెక్కిరి. కేదారనాథుడు వారందరకును తారకమంత్రోపదేశము చేసి మీలో ఇంకనూ భోగ తృష్ణగలవారు నాధామమున అలౌకిక భోగములననుభవించి తదుపరి ముక్తి బొందుడు. భోగవిరక్తుల నన్నే ధ్యానము చేయుచు మోక్షప్రాప్తులు గండని వారిని అనుగ్రహించి మహాకైలాసమునకు పంపిరి. పరమ భక్తుడగు మాంథాత శరీరమును తన కరకమలములచే నిమురుచు వత్సా నీక సశరీర కైవల్యమొసగు చుంటిని, మరేదైన వరమొసంగవలయునని సంకల్పించితిని. వరము కోరమనగా మాంథాత ప్రభో! కాశీలో పాపాత్ములకు భైరవ దండన అత్యంత ఘోరమయినది. అసమాన్యమగు మీ అంతర్గ్రుహమున ఎట్టి పాపులకునూ అట్టి భైరవ దండన లేకయే ముక్తినొసగుడని కోరగా, స్వామి కరుణించి, కాలభైరవ, దండపాణి, ఢుంఢిరాజ, ఆదికేశవ, బిందుమాధవ మరియు ఇతర దేవతా సమూహమునంతయూ చేరబిలిచి, కాశీలో నాయీ కేదార అంతర్గ్రుహమున మృతిజెందు ఎజీవికినీ, ఎంతటి పాపాత్ములయినను కాలభైరవ దండన లేకయే నా తారకమంత్రోపదేశముతో ముక్తులగుదురని ఆదేశించెను. అట్లు ఆదేశించి పరమాత్మ దేవతలచే సేవింపబడుచు, విశ్వేశ్వరుడే నవరత్నమణి మయ రూపముల కేదారేశ్వరుడుగ ఆపాషాణ రూప అన్నకూటమున అంతర్హితుడాయెను.
సూతుడిట్లు ముగించి, మునులారా ఈ కధాంశమును భక్తిపూర్వకముగ విన్నవారు ముక్తులగుదురని చెప్పెను.
కాని మాంథాత మనసు సాక్షాత్ కేదారేశ్వరుని దర్శనము కొఱకు ఆరోటపడుచున్నందున, పరమేశ్వరుడు సగభాగమున పార్వతితో అర్ధనారీశ్వరుడుగ వృషభవాహనారూఢుడై, కార్తికేయ, గణేశ, శివగణ సహితుడై, నందీశ్వరుడు ముందు నడువగా, కోటి సూర్య ప్రకాశముతో, కోటి చంద్రుల శీతల పవన శోభతో, సరస్వతీదేవి వీణావాదన సామగానము వినపించుచుండగా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ పత్నీ సమేతులై జయజయ ధ్వానములు సల్పుచుండగా పాషాణ రూపమయిన అన్నకూటము నుండి ప్రకటితమయి, శిలా ప్రతిమవలె నిశ్చేష్టుడై నిల్చుండిన మాథాతతో స్వామి గంభీరముగా భక్తాగ్రగణ్య శిఖామణీ మాంథాతా! నీ నీశ్చల తపోనిష్టకు, భక్తి ప్రపత్తులకు నేనెంతో తృప్తుడనైతిని. వేరెవ్వరకునూ అలభ్యమగు వరములు నీకివ్వ సంకల్పించితిని గనుక నీ అభీష్టము తెల్పునమిరి. మాంథాత తెలివిలోనికి వచ్చి స్వామి ప్రసాదించిన దివ్య దృష్టితో స్వామిని దర్శించి దండ ప్రణామమాచరించి ఆనందాశ్రువులు ధారా ప్రవాహముగ రాలుచుండ, మహాదేవా! బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకే అలభ్యమగు ఇట్టి మీ సాక్షాత్కారమునకు మూఢుడనయిన నేనునూ పాత్రుడనగుట నా పూర్వజన్మల సుకృతమగును. నీ భక్తుల సత్సంగ ఫలితమగును. ప్రభో ఈ శివభక్తులందరూ నిన్నెప్పుడూ మనమునచూడ నిచ్చగించు మహాత్ములు, గనుక నాపై తమకు గల దయా దృష్ఠి వీరందరిపై యుండు గాక, ఇక రెండవ వరముగా నాకు ముక్తిగూడ కోరను. అనగా పరమ శివుడు, నీవు భక్త శిఖామణి వయితివి, నీకు వరము ఇతరుల కొఱకు కోరుటయే నీ గొప్పతనము కనుక నాయీ దివ్యదర్శన భాగ్యము కొరకు నీవు కోరినట్లు ఇక్కడి వారందరకు దివ్యదృష్ఠి నిచ్చుచున్నాను. అనగనే అక్కడి మునులందరూ బ్రహ్మాదులకే అలభ్యమగు దివ్య దర్శనము చూచి ఆనంద తాండవము చేయుచు, జయ జయ ధ్వానములతో, వేదాంత, స్మృతి, శృతి, పురాణ స్తుతులతో, రుద్ర పాఠ ఘోషతో, మోక్షలక్ష్మీ ప్రార్ధనలతో శంకరుని స్తుతించిరి. వెంటనే శంభుని ఆజ్ఞపై ఆకాశమున శంఖారావ, ఘంటానాదములు మార్మోగ నూర్లకొలది రుద్ర కన్యలు ఛత్ర చామరములు వీచుచున్న విమానములు కన్పట్టెను. అక్కడి మహాత్ములందరు వారి భౌతిక శరీరములు వదలి సూక్ష్మ శరీర ధారులై ఆ విమానముల నెక్కిరి. కేదారనాథుడు వారందరకును తారకమంత్రోపదేశము చేసి మీలో ఇంకనూ భోగ తృష్ణగలవారు నాధామమున అలౌకిక భోగములననుభవించి తదుపరి ముక్తి బొందుడు. భోగవిరక్తుల నన్నే ధ్యానము చేయుచు మోక్షప్రాప్తులు గండని వారిని అనుగ్రహించి మహాకైలాసమునకు పంపిరి. పరమ భక్తుడగు మాంథాత శరీరమును తన కరకమలములచే నిమురుచు వత్సా నీక సశరీర కైవల్యమొసగు చుంటిని, మరేదైన వరమొసంగవలయునని సంకల్పించితిని. వరము కోరమనగా మాంథాత ప్రభో! కాశీలో పాపాత్ములకు భైరవ దండన అత్యంత ఘోరమయినది. అసమాన్యమగు మీ అంతర్గ్రుహమున ఎట్టి పాపులకునూ అట్టి భైరవ దండన లేకయే ముక్తినొసగుడని కోరగా, స్వామి కరుణించి, కాలభైరవ, దండపాణి, ఢుంఢిరాజ, ఆదికేశవ, బిందుమాధవ మరియు ఇతర దేవతా సమూహమునంతయూ చేరబిలిచి, కాశీలో నాయీ కేదార అంతర్గ్రుహమున మృతిజెందు ఎజీవికినీ, ఎంతటి పాపాత్ములయినను కాలభైరవ దండన లేకయే నా తారకమంత్రోపదేశముతో ముక్తులగుదురని ఆదేశించెను. అట్లు ఆదేశించి పరమాత్మ దేవతలచే సేవింపబడుచు, విశ్వేశ్వరుడే నవరత్నమణి మయ రూపముల కేదారేశ్వరుడుగ ఆపాషాణ రూప అన్నకూటమున అంతర్హితుడాయెను.
సూతుడిట్లు ముగించి, మునులారా ఈ కధాంశమును భక్తిపూర్వకముగ విన్నవారు ముక్తులగుదురని చెప్పెను.
Wednesday, March 25, 2009
19 వ అధ్యాయము
వ్యాస శిష్యాగ్రగణ్యా, సూతపౌరాణికా! కేదారేశ్వరుడు ప్రధమ పద్మ కల్పమందు కాశీకి వచ్చినట్లు, విశ్వేశ్వర అనుజ్ఞచే నందీశ్వరుడు హిమాలయ కేదారమునుండి కాశీకి తీసికొని వచ్చినట్లు తెల్పితిరి. ఎకారణమున ఇట్లు సంభవించినదని మునులు ప్రశ్నింపగా మరల సూతుడు చెప్పనారంభించిరి. పరమేశ్వరుడు అవ్యయుడయ అలాజ్ఞవస గోచరుడు. నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త, శిరాశ్రయ, నిరంజన, నిర్వికల్ప, నిష్కళంకుడుగా తానొక్కడే వ్యాపించియున్న పరమాత్మ తాను సర్వవ్యాప్తముగావలెనని తలంచిలీలచే శివ శక్త్యాత్మకముగు తాని శివ శక్తులుగా విడిపోయి తాను మహాకైలాసమున అపాకృత సదాశివునిగానే యుండి శక్తిని పాంచభౌతికముగా విభజించి తాను ఈశ్వర నామముతో బ్రహ్మాండ రచన చేసి ఆనందించుటకు గాను సృష్ఠి, స్థితి, లయలు నిర్వహించుటకు తానే బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా విభజించుకొని, కాల నిర్ణయముకొరకు పద్మ, వరాహాది కల్పములుగా విభజించి ఒక్కొక్క కల్పము బ్రహ్మ ఆయుః ప్రమాణమున ఒక్క రోజుగా చేసి కల్పాంతమున మహాప్రళయము సృష్టించి లయమొనర్చి మరల సృష్టి చేయుచూ ఇట్లు లీలాకేళీ విలాసము సంకల్పించినాడు.
ఒక పద్మ కల్పమున కాశీకి విచ్చేసిన విశ్వనాథుడు, మంధర పర్వత విహారమునకు వెళ్ళి మరల వచ్చినపుడు మూడులోకములలోని తీర్థ, క్షేత్ర, ప్రతిమ, దేవమూర్తి, లింగమూర్తులలోని శక్తులన్నియూ విశ్వేశ్వర సాన్నిధ్యము కోరి వారి నిజస్థానములలో వారి షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము వదని 15 కళలతో కాశీకి చేరిరి. అట్లే కేదారేశ్వరుడు కూడ హిమాలయములనుండి విచ్చేసిరి.
అదే సమయమున హిమాలయములందు మాంధాతయను చక్రవర్తి, సార్వభొముడు, సూర్యవంశజుడు, తన తండ్రి మృతినొందకయే తండ్రి గర్భముచీల్చుకొని బయటకు వచ్చిన మహిమాన్విత శక్తి సంపన్నుడు తన 50 మంది కుమార్తెలను సౌభరియను యోగిపుంగవునకొసగి విరక్తుడై రాజ్యభారమును పుత్రులకు వదలి హిమాలయములకు వెళ్ళి 100 యుగములు తపస్సుచేసి కేదారేశ్వరుని లింగదర్శనము కోరగా ఈశ్వరుడు ఆకోశవాణి రూపమున "భక్త శిరోమణీ నీతపస్సుకు మెచ్చితిని. కాని శివాదపాధమొనరించిన బ్రహ్మకు ఇక్కడ లింగదర్శనమివ్వ ఇచ్ఛగింపక అదృశ్యమయితిని. బ్రహ్మకు శిక్ష ముగిసిన తర్వాత కాశీలో లింగదర్శన భాగ్యమిచ్చితిని. నేనిక్కడ లింగ దర్శనమివ్వనని ప్రతిన బూనిన కారణమున నీవు వెంటనే నా కాశీ నగరమునకు వెళ్లి తపమాచరింపుమని" చెప్పెను. దానికి మాంథాత "స్వామీ మీ దర్శనము లేని రోజు నాకు నిరర్ధకము కనుక నాకు మనోవేగము నిండు. ప్రది దినము గోగర్భ గంగాస్నానము, జ్యావాముఖి దర్శనము, హిమాలయ కేదారేశ్వర దర్శనము, జగత్తునందలి సంపూర్ణ దివ్యక్షేత్రముల దర్శనము మనో వేగమున క్షణకాలమునందు నిర్వర్తించి కాశీలో ఘోర తపమాచరింతును" అనగా స్వామి అనుగ్రహించిరి. అట్లు ప్రాతఃకాలమున సర్వదర్శనముల తర్వాత కాశీ మణికర్ణికా స్నాన, విశ్వేశ్వర అర్చనాదులు ముగించుకొని సంతుష్టలై తపోనిష్టులైరి. కొంతకాలము గడచిన పిదప వృద్ధుడైన మాంథాత నిత్యయాత్రచేయ నశక్తుడాయెను! అపుడు మరల కేదారేశ్వరుడు ఆకాశవాణిగా " భక్త శిఖామణీ! నీవు మయోభారమున శక్తి తగ్గినవాడవగుటచేత మధ్యాహ్న భజనానంతరము నన్ను దర్శింపరమ్ము. నాకు భక్తి ప్రధానము గాని, నియమపాలనగాదు" అని తెల్పగా మాంథాత ఆశ్చరమయముతో శివాజ్ఞ ఉల్లంఘించుటెట్లు యని తలంచి, నియమపాలన ముఖ్య ధర్మము గదా! కాశీలో ఆతిధ్యము ముఖ్య ధర్మమని, దాని మహాత్మ్యమును శివుడు విష్ణుమూర్తికి తెల్పిన విధమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.
కొందరు చోరులు కాశీ వెలుపల గ్రామములందు చాలా ధనమపహరించి రాత్రికి రాత్రి పరుగున కాశికి చేరి కేదారవనమందుగల ఒక శివాలయమున ప్రమిదలో గల మిగిలిన నేతితో వారి పైవస్త్రము చివర చించి వత్తిజేసి దీపము వెలిగించి ఆలయములోని స్వామి సన్నిధిన వస్త్రము పరిచి దొంగిలించిన సొమ్ము భాగములు చేసి పంచుకొను సమయమున భేధాభిప్రాయమున కలహించుకొని తెల్లవారకమునుపే వారి గృహములకు చేరిరి. అందు దీపము వెలిగించిన దొంగ తెలియక చేసినప్పటికి శివాలయమున నేతిదీపారాధన ఫలితమున మరు జన్మ కళింగ దేశాధిపతిగా పుట్టెను. క్రిత జన్మ రహస్యము తెలిసికొనిన ఆరాజు తన దేశమున అన్ని శివాలయములలోను దీపమాలిక నిత్యము వెలిగింపజేసి పూజింపదొడగెను. పుత్ర పౌత్రులు సర్వభోగముల ననుభవించి యజ్ఞములు, దానములు సల్పి అంతమున కాశీవాసము జేసిముక్తి బొందెను. అని విష్ణుమూర్తికి శివుడు చెప్పిన కథము సనత్కుమారుడు వామదేవునికిని, నాథశర్మ తన భార్య అనవద్యకును వినిపింపగా, అనవద్య భర్తద్వారా కాశీలో నిత్య నియమములు, వాని మహత్మ్యము, మాంథాత ఆచరించిన విధిని, తెలుసుకొనగోరగా నాథశర్మ ఇట్లు తెల్పెను. కాశీలో నిర్వహించిన కొద్ది ధర్మమయినను మేరుపర్వతమంత పుణ్య ఫలప్రదమగును. ఇందు సందేహము వలదు. బ్రాహ్మణాది చండాలురవరకు, స్త్రీ పురుష, నపుంసకువరకు, అనులోమ విలోమజాతులు, మ్లేచ్ఛ, హూణ, యవనులకయినను తెలిసి, తెలియక కొద్ది ధర్మమాచరించినను అది అమోఘ ఫలదాయకము. శివునకు ఒక్క జలబిందువు, బిల్వపత్రము, తిలమిశ్రిత తండులములు, వారి వైభవముననుసరించి పూలు, గడ్డిపరక అయినను శివార్పణమని విడిచిన వారిక అమోఘఫల మబ్బును. దశదాన, షోడశ దానములును, గంగా తటమున మెట్లు, మఠములు, జనావాసములు కట్టించినవారు స్వర్గాది శివలోకములవరకు అన్నిభోగముల ననుభవించి క్రమశః పునరావృత్తిరహిత మోక్షమును బొందుదురు. దేవతలు, మునులు, రాజన్యులు ప్రతి దినము కాశీలో ధర్మమాచరించు సదవకాశము కొఱకు నిరీక్షింతురు. ఇక శంకరుల ఆజ్ఞవినిము. కాశీలో అన్నదానమొనరించువారి విషయమున అన్నములోని మొదటి మెతుకునకు ధర్మమును, రెండవ మెతుకునకు అర్ధమును మూడు, నాల్గు మెతుకులకు కామ మోక్షములనిత్తును. ఇక మిగిలిన అన్నమునకేమి ఇవ్వవలసియుండనని ఆలోచింతుననెను. కలియుగమున చతుర్విధ ఫల పురుషార్ధముల నొసగు స్థలము కాశీతక్క వేరొండు లేదు. కాశీలో మాంథాత నిత్య వ్రతముగ ప్రాతఃకాల కేదార పూజానంతరము నిత్యయాత్ర చేసి వచ్చి మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర నిత్యయాత్ర, తర్వాత ప్రాచీన మణికర్ణికా స్నానము, భిక్షుకులకు ఆతిధ్యము నొసగి అపుడు భోజనము చేయును. నిత్య యాత్రము, మాసయాత్రము, వార్షిక యాత్రలు విధివిధానముగ జేయును. ఆకాశవాణి రూపమున భోజనము చేసి కేదారయాత్రము రమ్మని శివాజ్ఞనెట్లు ఆచరించుట ఏది కర్తవ్యము? సంశయనివారణకు కాశీలోని శివభక్తులు, వేదపండితుల వద్దకు వెళ్ళి నమస్కరించి పరిష్కారమడిగెను. వారు సంతోషించి శివాను ఆకాశవాణి రూపమున విని, నిత్యవ్రతుడైన మాంథాతను ప్రశంసించి నమస్కరించిరి.
ఒక పద్మ కల్పమున కాశీకి విచ్చేసిన విశ్వనాథుడు, మంధర పర్వత విహారమునకు వెళ్ళి మరల వచ్చినపుడు మూడులోకములలోని తీర్థ, క్షేత్ర, ప్రతిమ, దేవమూర్తి, లింగమూర్తులలోని శక్తులన్నియూ విశ్వేశ్వర సాన్నిధ్యము కోరి వారి నిజస్థానములలో వారి షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము వదని 15 కళలతో కాశీకి చేరిరి. అట్లే కేదారేశ్వరుడు కూడ హిమాలయములనుండి విచ్చేసిరి.
అదే సమయమున హిమాలయములందు మాంధాతయను చక్రవర్తి, సార్వభొముడు, సూర్యవంశజుడు, తన తండ్రి మృతినొందకయే తండ్రి గర్భముచీల్చుకొని బయటకు వచ్చిన మహిమాన్విత శక్తి సంపన్నుడు తన 50 మంది కుమార్తెలను సౌభరియను యోగిపుంగవునకొసగి విరక్తుడై రాజ్యభారమును పుత్రులకు వదలి హిమాలయములకు వెళ్ళి 100 యుగములు తపస్సుచేసి కేదారేశ్వరుని లింగదర్శనము కోరగా ఈశ్వరుడు ఆకోశవాణి రూపమున "భక్త శిరోమణీ నీతపస్సుకు మెచ్చితిని. కాని శివాదపాధమొనరించిన బ్రహ్మకు ఇక్కడ లింగదర్శనమివ్వ ఇచ్ఛగింపక అదృశ్యమయితిని. బ్రహ్మకు శిక్ష ముగిసిన తర్వాత కాశీలో లింగదర్శన భాగ్యమిచ్చితిని. నేనిక్కడ లింగ దర్శనమివ్వనని ప్రతిన బూనిన కారణమున నీవు వెంటనే నా కాశీ నగరమునకు వెళ్లి తపమాచరింపుమని" చెప్పెను. దానికి మాంథాత "స్వామీ మీ దర్శనము లేని రోజు నాకు నిరర్ధకము కనుక నాకు మనోవేగము నిండు. ప్రది దినము గోగర్భ గంగాస్నానము, జ్యావాముఖి దర్శనము, హిమాలయ కేదారేశ్వర దర్శనము, జగత్తునందలి సంపూర్ణ దివ్యక్షేత్రముల దర్శనము మనో వేగమున క్షణకాలమునందు నిర్వర్తించి కాశీలో ఘోర తపమాచరింతును" అనగా స్వామి అనుగ్రహించిరి. అట్లు ప్రాతఃకాలమున సర్వదర్శనముల తర్వాత కాశీ మణికర్ణికా స్నాన, విశ్వేశ్వర అర్చనాదులు ముగించుకొని సంతుష్టలై తపోనిష్టులైరి. కొంతకాలము గడచిన పిదప వృద్ధుడైన మాంథాత నిత్యయాత్రచేయ నశక్తుడాయెను! అపుడు మరల కేదారేశ్వరుడు ఆకాశవాణిగా " భక్త శిఖామణీ! నీవు మయోభారమున శక్తి తగ్గినవాడవగుటచేత మధ్యాహ్న భజనానంతరము నన్ను దర్శింపరమ్ము. నాకు భక్తి ప్రధానము గాని, నియమపాలనగాదు" అని తెల్పగా మాంథాత ఆశ్చరమయముతో శివాజ్ఞ ఉల్లంఘించుటెట్లు యని తలంచి, నియమపాలన ముఖ్య ధర్మము గదా! కాశీలో ఆతిధ్యము ముఖ్య ధర్మమని, దాని మహాత్మ్యమును శివుడు విష్ణుమూర్తికి తెల్పిన విధమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.
కొందరు చోరులు కాశీ వెలుపల గ్రామములందు చాలా ధనమపహరించి రాత్రికి రాత్రి పరుగున కాశికి చేరి కేదారవనమందుగల ఒక శివాలయమున ప్రమిదలో గల మిగిలిన నేతితో వారి పైవస్త్రము చివర చించి వత్తిజేసి దీపము వెలిగించి ఆలయములోని స్వామి సన్నిధిన వస్త్రము పరిచి దొంగిలించిన సొమ్ము భాగములు చేసి పంచుకొను సమయమున భేధాభిప్రాయమున కలహించుకొని తెల్లవారకమునుపే వారి గృహములకు చేరిరి. అందు దీపము వెలిగించిన దొంగ తెలియక చేసినప్పటికి శివాలయమున నేతిదీపారాధన ఫలితమున మరు జన్మ కళింగ దేశాధిపతిగా పుట్టెను. క్రిత జన్మ రహస్యము తెలిసికొనిన ఆరాజు తన దేశమున అన్ని శివాలయములలోను దీపమాలిక నిత్యము వెలిగింపజేసి పూజింపదొడగెను. పుత్ర పౌత్రులు సర్వభోగముల ననుభవించి యజ్ఞములు, దానములు సల్పి అంతమున కాశీవాసము జేసిముక్తి బొందెను. అని విష్ణుమూర్తికి శివుడు చెప్పిన కథము సనత్కుమారుడు వామదేవునికిని, నాథశర్మ తన భార్య అనవద్యకును వినిపింపగా, అనవద్య భర్తద్వారా కాశీలో నిత్య నియమములు, వాని మహత్మ్యము, మాంథాత ఆచరించిన విధిని, తెలుసుకొనగోరగా నాథశర్మ ఇట్లు తెల్పెను. కాశీలో నిర్వహించిన కొద్ది ధర్మమయినను మేరుపర్వతమంత పుణ్య ఫలప్రదమగును. ఇందు సందేహము వలదు. బ్రాహ్మణాది చండాలురవరకు, స్త్రీ పురుష, నపుంసకువరకు, అనులోమ విలోమజాతులు, మ్లేచ్ఛ, హూణ, యవనులకయినను తెలిసి, తెలియక కొద్ది ధర్మమాచరించినను అది అమోఘ ఫలదాయకము. శివునకు ఒక్క జలబిందువు, బిల్వపత్రము, తిలమిశ్రిత తండులములు, వారి వైభవముననుసరించి పూలు, గడ్డిపరక అయినను శివార్పణమని విడిచిన వారిక అమోఘఫల మబ్బును. దశదాన, షోడశ దానములును, గంగా తటమున మెట్లు, మఠములు, జనావాసములు కట్టించినవారు స్వర్గాది శివలోకములవరకు అన్నిభోగముల ననుభవించి క్రమశః పునరావృత్తిరహిత మోక్షమును బొందుదురు. దేవతలు, మునులు, రాజన్యులు ప్రతి దినము కాశీలో ధర్మమాచరించు సదవకాశము కొఱకు నిరీక్షింతురు. ఇక శంకరుల ఆజ్ఞవినిము. కాశీలో అన్నదానమొనరించువారి విషయమున అన్నములోని మొదటి మెతుకునకు ధర్మమును, రెండవ మెతుకునకు అర్ధమును మూడు, నాల్గు మెతుకులకు కామ మోక్షములనిత్తును. ఇక మిగిలిన అన్నమునకేమి ఇవ్వవలసియుండనని ఆలోచింతుననెను. కలియుగమున చతుర్విధ ఫల పురుషార్ధముల నొసగు స్థలము కాశీతక్క వేరొండు లేదు. కాశీలో మాంథాత నిత్య వ్రతముగ ప్రాతఃకాల కేదార పూజానంతరము నిత్యయాత్ర చేసి వచ్చి మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర నిత్యయాత్ర, తర్వాత ప్రాచీన మణికర్ణికా స్నానము, భిక్షుకులకు ఆతిధ్యము నొసగి అపుడు భోజనము చేయును. నిత్య యాత్రము, మాసయాత్రము, వార్షిక యాత్రలు విధివిధానముగ జేయును. ఆకాశవాణి రూపమున భోజనము చేసి కేదారయాత్రము రమ్మని శివాజ్ఞనెట్లు ఆచరించుట ఏది కర్తవ్యము? సంశయనివారణకు కాశీలోని శివభక్తులు, వేదపండితుల వద్దకు వెళ్ళి నమస్కరించి పరిష్కారమడిగెను. వారు సంతోషించి శివాను ఆకాశవాణి రూపమున విని, నిత్యవ్రతుడైన మాంథాతను ప్రశంసించి నమస్కరించిరి.
Monday, March 23, 2009
అష్టాదశోధ్యాయము
మునులు మరల సూతుని, మహాత్మా దుర్ధరుడు ఎట్లు ఉద్ధరింపబడెను? వినిపింపుడనగా సూతుడిట్లు తెల్పెను. మేలక దుర్ధరుని విమానములో కూర్చుండ బెట్టుకొని స్వర్గమునుండి కాశీకి వచ్చెను. కాశీ విశ్వేశ్వర, కేదారేశ్వరులను పూజించుటకొరకు స్వర్గములోని నందనవనము నుండి పాజాతములు తెచ్చెను. విమానము కాశీ చేరిన వెంటనే ఆకాశమున సంచరించు శివగణములు విమానమును నిల్పివేసి మేనకతో, నీవు తీసికొనివచ్చిన ఈ దుర్ధరుడు పరమ పాతకుడు. ఇతనిని కాశీలోనికి అడుగు పెట్టనివ్వము. వానిని కాశీవెలుపలే వదని నీవు వెళ్లి స్వామిని అర్చించి రమ్మనిరి. కోటి కల్పాంతములవరకు నరకయాతన అనుభవింపపలసిన ఈపాపిని వేరుకారణమున యముడు నీ వద్దకు పంపియుండవచ్చును గాని, వీనికి కాశీ ప్రవేశార్హతలేదనిరి. అపుడు మేనక వారిని ప్రార్ధించి సర్వజ్ఞుడయిన యముడు వానిని ఉద్ధరించుటకు నావద్దకు పంపిరి గనుక మీరు వానిని కరుణించి జ్ఞాన దృష్ఠితో పరికించి వానికి తరుణోపాయము తెల్పుడనగా, శివగణము ఆమె కోరికపై జ్ఞనదృష్ఠితో దుర్ధరుని వృత్తాంతము తెలిసికొని మేనకతో అమ్మా ఈపాపి విషప్రయోగముతో చంపనుంకించిన శివానందుడను యోగిపుంగవుడు నిగ్రహానుగ్రహ సంపన్నుడై యిపుడు కాశీలో నున్నాజు. జ్ఞనదృష్ఠితో ఇతడు చేసిన దుశ్చర్య తెలిసియూ ఇతడు మహాపాపియయినను అతని మనసులో ఇతనికి శుభము కల్గవలెనని తలంచి అతడే ఇతని దహన క్రియలు సల్పినాడు. దుర్ధరుని ఇక్కడ వదలి, నీవు వెళ్ళి ఆమహాత్ముని దర్శించి విషయములను వివరించి అతని ఆదేశానుసారముగ ప్రవర్తించమని శివగణము మేనకతో చెప్పి ఆ శివానందయోగిని తెలిసికొనుట కష్టము. అతడు సాధారణముగా కన్పించు వ్యక్తిగాడు. కాశీలో తపోధనులందరు, శ్రావణ సోమవారమున, విశేషముగ పూర్ణిమతో చేరిన శ్రావణ సోమవారమునను, మూడులోకములలోని వారు శ్రీకాశీకేదారేశ్వరుని సేవించుటకు వచ్చెదరు. కార్తీక పూర్ణిమ, విశేషముగ సోమవారము కలిసినచో, ఆమాస ఆర్ద్రా నక్షత్రమునాడు, పుష్యమాస పుష్యమీ నక్షత్రమునాడు మాఘమాస మఖ నక్షత్రమునాడు, ఫాల్గుణమాస పూర్వ ఫల్గుణి నక్షత్రమునాడు, చైత్రమాస చిత్ర నక్షత్రమునాడు, వైశాఖమాస విశాఖ నక్షత్ర దినమున, జ్యేష్ఠమాస జ్యేష్ఠా నక్షత్రదినమున, ఆషాఢమాస పూర్వాషాఢ నక్షత్రము రోజున, భాద్రపద మాసమున ఉత్తరాభాద్ర నక్షత్రమునాడు, మరియు ఆశ్వీయుజ పౌర్ణమి దినములలో త్రలోకములలోని తపస్వులందరు కాశీని సేవించుటకు వత్తురు. వీరందరు విశ్వేశ్వరాది దేవతల దర్శనానంతరము కేదారేశ్వరుని సేవించుటకు తప్పక వచ్చెదరు. వారిలో నీవు శివానందుని గుర్తించి ప్రార్ధింపగలవు. నీ పుణ్య విశ్షమున ఈరోజే శ్రావణ పూర్ణిమ. విశేష సోమవారమయినది. అందరకూ కన్పించకపోయినను అతడు నీకు దర్శనమిచ్చును. ఎందుకనగా పరోపకారపరాయణులకు దర్శన మిచ్చుట అతని నైజము. అని పలుకగా మేనక దుర్ధరుని, విమానమును అక్కడవదలి మనోవేగముతో కాశీలోనికి ప్రవేశించెను. విశ్వేశ్వర దర్శన మణికర్ణికా స్నానములాచరించి శ్రీ కేదారేశ్వర మందిరముచేరి నమస్కరించి పూజించి వేయికన్నులతో శివానందయోగి దర్శనార్ధము నాల్గుమూలల పరికించుచుండెను. తూర్పు ముఘద్వారము నుండి క్రిందకు చూడగా సహస్ర కిరణ సూర్య ప్రకాశముతో ఒక యోగి ప్రాచీన మణికర్ణిక తీర్థము వద్ద కన్పించెను. అతడే శివానందుడు. విశ్వేశ్వర, మణికర్ణికల నర్చించి శివాపరాధ నివృత్త తీర్థమగు హరంపాప/ రేతోదక/ గౌరీకుండ/ ప్రాచీన మణికర్ణికకు వచ్చి స్నానమొనరించినంతెనే మేనక అతని పాదములపై వ్రాలి మహాత్మా నన్ననుగ్రహింపుడని వేడగా, శివానందులు చిరునగవుతో అప్సర సామణి శుభమేగదా యనగా, మేలక సర్వజ్ఞా! మీ కృపకు పాత్రురాలనగు నాకేమి కొదువ? ఇపుడు నేను వచ్చిన కార్యము సానుకూలమగునట్లు వరమిండనిగా, మరల శివానందులు నవ్వి, మేనకా! నీవు పరోపకార బుద్ధితో బయలుదేరినది మొదలుగా నేను జ్ఞానదృష్టితో తిలకించుచుంటిని, నీవు ఈ తీర్థ జలము, కేదారేశ్వర నిర్మాల్య బిల్వపత్రము తీసికొని వెళ్లి దుర్ధరునిపై వేసిన యడల శివగణము వానినడ్డగించక లోనికి రానిత్తురు. అపుడు నీవతనిని తీసికొని నావద్దకు రమ్మని చెప్పగా, మేనక మహాప్రసాదమని యోగిచెప్పినవిధముగా తీర్థ జలము, బిల్వపత్రములు దుర్ధరునిపై వేయగా మహాశ్చర్యముగా అతని దేహమునుండి కాకులు, గద్దలు, గుడ్లగూబలు, కొంగలు, కుక్కలు, గాడిదలు, పులులు, సింహములు, ఎద్దులు, బఱ్ఱెలు, ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలు, తోడేళ్ళు, పిల్లులు, జింకలు, పాములు, తేళ్ళు, మల క్రిములతో సహా క్రిమికీటకాదులు మొదట బయటకు వచ్చిన తర్వాత, బ్రహ్మరాక్షస, భేతాళాది కోట్లకొలది పిశాచములు హాహాకారములు చేయుచు నల్లని కాలిన శరీరములతో పర్వతాకారములు గల్గి బయటపడినావారు రోదించుచు ఆకాశమున నిల్చిరి. ఇంకనూ మహాశ్చర్యముగ దుర్ధరుని శరీరమునుండి సూర్యకిరణములవలె మెఱుపులు బయల్వెడలి ఆకాశమునంటి మొదటినుండి అతని శరీరమునుండి బయటకు వచ్చిన అండజ, స్వేదజ, జరాయుజ, పిశాచాదులనన్నిటిని భస్మమొనర్చి మరల అతని శరీరమునకు వచ్చి అదృశ్యమయినవి. అట్లు భస్మమయిన పొగ యంతయూ ఆకాశమును కప్పివేసి ఆకాశము నీలిమయినది. ఈ అద్భుత దృశ్యముచూచి చకితురాలయిన మేనక శివగణమును ప్రార్ధించి ఆవింతను గురించి తెల్పుడనగా, వారు దుర్ధరుడు క్రితము జన్మలలో చేసిన పాపమునకు గాను అతనినుండి బయల్వెడలిన అన్నిరకముల భూత యోనులలోను నూరు, నూరు సంవత్సరములు జీవించవలసి యున్నది గనుక అవన్నియూ వాసనారూపమున ఇతని అంతఃకరణమందు నిల్చియున్నవి. నీవు అతనిపై చిలికిన తీర్థమహాత్మ్యమున, కేదారేశ్వర నిర్మాల్య బిల్వస్పర్శవలనను అవన్నియూ నిల్వలేక బయటపడి రోదించుచుండగా, మరల అవి అతనినాకర్షించకుండుటకు తీర్థమహాత్మ్యమున అతనిలో ప్రవేశించిన శక్తి కిరణములు వచ్చి వానిని భస్మమొనరించి మరల అతనిలో చేరినవని చెప్పి అంతటి మహోపకారము తలపెట్టిన మేనకను ప్రశంసించి ఇప్పుడతనిని కాశీలో ప్రవేశించుటకు అనుమతింతుము, వెంటనే తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేయుమనిరి. ఇదంతయు జ్ఞానదృష్టిచే తెలిసికొనిన శివానందుడు నిన్నిట్లు ఆదేశించెను. ఇదంతయు తెలిసిన మేము నిన్నతనివద్దకు పంపితిమనిరి. మేనక వారికి నమస్కరించి దుర్ధరుని తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేసెను. యోగి ప్రసన్నుడై తన పాదముల చెంతనున్న దుర్ధరుని లేవనెత్తి విధివిధానముగా ప్రాచీన మణికర్ణికా స్నానము చేయించగా మరొక వింత జరిగినది. దుర్ధరుని శరీరమునుండి ఒక స్వచ్ఛ మైన తెల్లని హంస బయటకు వచ్చి యోగికి నమస్కరించి నేను ఇతని అంతఃకరణమును. ఒకనాడు ఈతడొకపుష్పమును శివార్పణమన్న కారణమున శివ పుణ్యమను నేను శ్వేతహంస రూపమున ఇతనియందు చేరితిని. ఇతడు చేసిన మహాపాపములు నన్ను హింసించినవి. ఇపుడు మీదయవలన అన్నియూ ధ్వంసముకాగా నేను సుఘముగా మీ దర్శనమునకు బయటకు వచ్చితిని. ఇతడు చపల చిత్తుడు. మరల నేనితనిలో ప్రవేశించిన యడల మరల పాపములు చేసి నన్ను బాధించును గనుక మీ ఆజ్ఞ ప్రకారము నేను ప్రవర్తింతును. ఇతనిలో చేరుటయా లేక మిమ్ము సేవించుటయా అని ఆ హంస శివయోగిని ప్రశ్నింపగా యోగి ఆ హంసతో ఇట్లనెను. ఈతడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. ధర్మభ్రష్టుడే అత్యంత పాపి అయినాడు. సర్వభక్షకుడై అగామగామియై నీచజాతి స్త్రీలోలుడై దశార్ణదేశమున మ్లేచ్ఛుల సహవాసమున మ్లేచ్ఛ స్త్రీలంపటుడై ఒకనాటి రాత్రి గ్రామము వెలుపల ఒక వనములో శిధిలమైన ఒక సోమేశ్వర దేవాలయమున ఆ స్త్రీ సంగమము కొరకు తీసికొని వెళ్లి, తన వస్త్రముతో గర్భాలయమును శుభ్రముచేసి ఆ వస్త్రమును వెలుపలకు విసిరివేసి, ఆ స్త్రీకొరకు తెచ్చిన మాలలు, తాంబూలము ఆ చీకటిలో తడుముకొనుచి ఎదో రాతి దిమ్మయని తలచిన శివలింగము పైనుంచి, ఆ స్త్రీని చేయిపట్టుకొని లోనికి తీసికొనివచ్చి అనుభవించు సమయమున ఆ మాలలు, వగైరా తీసి ఆ స్త్రీకి సమర్పించెను. తెలియక చేసిననూ ఆ పుష్పమాలలు, విడియము, శివార్పితమయిన పుణ్యమున ఇతడు కాంచీ క్షేత్రమున ఒక వెశ్య పుత్రుడుగా జన్మించెను. ఇతని తల్లి వేశ్యయై వర్ణ సంకరమయిన కారణమున, అట్టి గర్భజనితుడు ఇతని బుద్ధి భ్రష్టమయినది. పరమ పాపి అయినను, మాలలు విడియము క్రితజన్మ యందు శివుని కర్పించిన కారణమున, తన చేతినుండి జారిపడిన పుష్పమును తనకు తెలియకనే శివార్పణమను పదము తన నోటిద్వారా ఉచ్ఛరించిన కారణమున శివాజ్ఞచే శివపుణ్యమము నీవు హంసరూపమున ఇతనిలో ప్రవేశించితిని. నీమహిమయే యమధర్మరాజు చే మరల ఆలోచింపజేసి, తెలియక చేసిననూ ఆ ఒక్క పుణ్య ఫలము ఇతనిని స్వర్గమందు మేనకవద్దకు పంపినది. ఆమెకు ఇతనిని ఉద్ధరించి ఉద్దేశ్యము కల్గినది. కాశీ ప్రాచీన మణికర్ణిక జలము, కేదారేశుని నిర్మాల్య పుష్పములు తాకినంతనే అతనిలోని పాప సముచ్ఛయమంతయూ నిర్గమించి భస్మమయినదు. ఇతని కింకనూ మంచి జరుగనున్నదని శివయోగి వచించెను. అపుడు శివపుణ్యమను హంస మరల దుర్ధరుని అంతరాత్మను చేరినది. ఈ సంవాదమంతయు మేనకకు అవగతమయినది. కాని దుర్ధరునికి తెలియదు. శివానందులు మేలక, దుర్ధరులను కేదారేశ్వరుని వద్దకు తీసికొని వెళ్లి, నందన వనము నుండి మేనక చే తేబడిన పుష్పములచే కేదారేశ్వరుని వారిద్దరిచే పూజింపజేసెను. ప్రదక్షిణ నమస్కారముల తర్వాత కేదారేశ్వరుని స్తుతింపగా పరమేశ్వరుడు వృషభ వాహనుడై పార్వీ సమేతుడై, వినాయక, షణ్ముఖ, శివగణ సమేతుడై శివానందులకు దర్శనమిచ్చి, నాకు అత్యంత ప్రీతిపాత్రుడవగు నీ కృపకు పాత్రుడైన ఈ దుర్ధరుడు ప్రతిష్ఠానపురమున రాజ కుమారుడుగా జన్మించును. అక్కడ రాజు తపమాచరించి నన్ను కుమారునిగా పొందగోలెను. అతనికి నా అనుగ్రహమున ఈ దుర్ధరుడు కుమారుడు కాగలడు. శివభక్తి పరాయణుడై కాశీకి వచ్చి విశ్వేశ్వర, మణికర్ణిక, కేదారేశ్వరాదుల నర్చించి అధిక సంపన్నుడైనందున బ్రాహ్మణులను సత్కరించి, తపో యోగమార్గముల నవలంబించి సార్వభౌముడై, నా అనుజ్ఞచే బ్రహ్మద్వారా వరములు పొంది ఈ కాశీ పట్టణమునకు దివోదాసను పేర రాజగును. దేవతలను మించిన శక్తి సంపన్నుడై తపోబలముచే పంచ భూతములను తిరస్కరించి తానే వారి కృత్యములు చేయుచు, నా మాయామొహమున కాశీలోని దేవతలనందరనూ నాతో సహా కాశీనుండి బయటకు పంపివేసి, తుదకు విరక్తుడై మాయ వదలగనే నా పదము పొందును. కనుక ఇతనిని మేనకతో స్వర్గమునకు పంపి తృప్తి తీరునంతవరకు స్వర్గసౌఖ్యమనుభవించి తదుపరి భూలోకమున ప్రతిష్ఠానపుర రాజకుమారునిగా జన్మింప నిమ్మని పరమేశ్వరుడు శివయోగికి చెప్పి అంతర్ధానమయ్యెను. శివానందులు ఆనందపారవశ్యమున శివుని స్తుతించి మేనకా దుర్ధరులను స్వర్గమునకు పంపెను. దేవతలెట్లు సద్యఃఫల సిద్ధి బొందుదురో అట్లే మనుష్య దేహధారులును శివభక్తి పరాయణులగుచో సర్వసౌఖ్యమున ననుభవించి తుదకు ముక్తి బొందుదురు. అట్లు శివానందుని అనుగ్రహ పాత్రుడయిన పరమపాపియు దురాత్ముడగు దుర్ధరుడే దివోదాసుగా కాశీని పరిపాలించి దేవతలనేధిక్కరించి, చివరకు పరమాత్మనే మందరాచలమునకు పంపివేయగల సమర్ధుడాయెను. తన భక్తుల కీర్తి ప్రబలుటకై శంకరుడునూ లీలా విలాసము చేయుచుండును. ముల్లోకములయందు కాశీ క్షేత్రము, విశ్వేశ్వర, మణికర్ణికాది సేవనము ప్రబల పాపహరములు. శివాపరాధమను ఘోరపాపము మాత్రము ప్రాచీన మణికర్ణికా స్నానము, కేదారేశ్వర సేవనమున మాత్రమే విముక్తమగును.
ఇట్టి కాశీమూల రహస్యమగునది శివాజ్ఞచే నాకు స్ఫురించి మీకు తెల్పితినని సూతుడు వచించెను. కాశీలో అడుగడుగుననూ గల తీర్థములు, లింగముల మహిమ ఆ శివునికే తెలియును గాని అన్యులెరుగరు. కేదారేశ్వర, ప్రాచీన మణికర్ణికల మహిమ తెలియుట దుర్లభము. దేశాంతరమందు, కాశీ తక్క మరెక్కడ నయిననూ చేసిన పాపములకు సూర్యపుత్రుడు యముడు దండనాయకుడు. కాని కాశీలో అతనికి స్థానము లేనందున కాశీలో పాపులను శిక్షించునది కాలభైరవుడు. కాశీలో శివాపరాధులకు నిష్కృతి లేనేలేదు. కాశీలో మరణించువారు ముక్తులగుదురు. కాశీలో కొద్ది ధర్మమయిననూ అమోఘ ఫలమొసంగును. ఒక్క పర్యాయమైనను కాశీ దర్శించి వెళ్ళి వేరెక్కడ మృతిచెందినను వారికి మరుజన్మగాని తదుపరి జన్మగాని కాశీలో తథ్యము. కాశీ మృతి వెంటనే జన్మరాహిత్యకారకము. కృత, త్రేతా, ద్వాపరయుగముల కంటె కలియుగమున కలిదోషముచే జీవులు శివాపరాధులగుదురు. అట్టివారికి తరుణోపాయము కాశీలో ప్రాచీన మణికర్ణిక, కేదారనాథ సేవనము తక్క వెరొండులేదు. ప్రేమపాత్రులగు సతి, గౌరి, రావణాసులులకే మోహవసమున శివాపరాధ దోషము ప్రాప్తించి వారికిని కాశీ ప్రాచీన గంగ, కేదారసేవనముల వలననే తద్దోష నివారణ జరిగినదన సాధారణ జీవుల గతి చెప్పవలెనా! యని సూతముని చెప్పగా శౌనకాదులు సంతసించిరి.
ఇట్టి కాశీమూల రహస్యమగునది శివాజ్ఞచే నాకు స్ఫురించి మీకు తెల్పితినని సూతుడు వచించెను. కాశీలో అడుగడుగుననూ గల తీర్థములు, లింగముల మహిమ ఆ శివునికే తెలియును గాని అన్యులెరుగరు. కేదారేశ్వర, ప్రాచీన మణికర్ణికల మహిమ తెలియుట దుర్లభము. దేశాంతరమందు, కాశీ తక్క మరెక్కడ నయిననూ చేసిన పాపములకు సూర్యపుత్రుడు యముడు దండనాయకుడు. కాని కాశీలో అతనికి స్థానము లేనందున కాశీలో పాపులను శిక్షించునది కాలభైరవుడు. కాశీలో శివాపరాధులకు నిష్కృతి లేనేలేదు. కాశీలో మరణించువారు ముక్తులగుదురు. కాశీలో కొద్ది ధర్మమయిననూ అమోఘ ఫలమొసంగును. ఒక్క పర్యాయమైనను కాశీ దర్శించి వెళ్ళి వేరెక్కడ మృతిచెందినను వారికి మరుజన్మగాని తదుపరి జన్మగాని కాశీలో తథ్యము. కాశీ మృతి వెంటనే జన్మరాహిత్యకారకము. కృత, త్రేతా, ద్వాపరయుగముల కంటె కలియుగమున కలిదోషముచే జీవులు శివాపరాధులగుదురు. అట్టివారికి తరుణోపాయము కాశీలో ప్రాచీన మణికర్ణిక, కేదారనాథ సేవనము తక్క వెరొండులేదు. ప్రేమపాత్రులగు సతి, గౌరి, రావణాసులులకే మోహవసమున శివాపరాధ దోషము ప్రాప్తించి వారికిని కాశీ ప్రాచీన గంగ, కేదారసేవనముల వలననే తద్దోష నివారణ జరిగినదన సాధారణ జీవుల గతి చెప్పవలెనా! యని సూతముని చెప్పగా శౌనకాదులు సంతసించిరి.
సప్తదశోధ్యాయము
మునులు సూతునితో, మహాత్మా! మీరు శివరహస్యకోవిదులు. లేశమాత్ర శివ నామస్మరణ మహాపాపియగు దుర్ధరునికి స్వర్గప్రాప్తి కల్గించినది. శివజ్ఞానికి అతనిపై గల్గిన కృపాలేశము యమధర్మరాజుకు అతనిపై దయ గల్గునట్లు చేసినది గనుక జీవతమున శివభక్తి రహస్యమును గురించి వినని జన్మ వ్యర్థము. దయచేసి మేనక అతని నెట్లు ఉద్ధరించినది తెల్పుడని కోరిరి. సూతుడిట్లు వచించిరి.
దేవకన్య మేనక దుర్ధనునెట్లు ఉద్ధరించుటాయని ఆలోచించి అతనినోదార్చి తను కైలాసమందు పరాశక్తి దర్శనము చేసికొనివచ్చువరకు అతనినక్కడే ఉండమని చెప్పి వెళ్ళెను. కైలాసమందు శివభక్తులు దేవిసేవకై దుర్వాస, గౌతమ, కణ్య, దధీచి, అంగిరస, భృగు, నారద, ఉపమన్యులు బ్రహ్మవాద శ్రేష్ఠులు ఎనమండుగురు మొదట శైలాదు గణేశ, కార్తికేయులను సేవించి తదుపరి పరమేశ్వరుని అర్చించి పరాశక్తిని పూజించుటకై అమ్మవారి వద్ద చేరిరి. అమ్మవారిని అనేక విధముల స్తుతించి తల్లి ఆజ్ఞమేరకు అక్కడ వేచియున్న సమయమున మేనక అక్కడకు చేరి వారందరకు నమస్కరించి అమ్మవారిని ఆనందపరచుటకై నాట్యము చేయనారంభించెను. పరాశక్తి చాలాకాలము నాట్యము చూచి ఆనందించి శివభక్తులనుద్దేశించి బ్రాహ్మణోత్తములారా ఎక్కడనుండి వచ్చినారు? ప్రపంచమున మీరు చూచిన గొప్ప ఆశ్చర్యకరమైన వింతలేమని ప్రశ్నించిరి. దానికి ముందుగా నారదమహర్షి తల్లీ! శివపార్వతులకు అపరాధము చేసినవారికైనను మంచి జరుగవచ్చును కాని మీభక్తులకపరాధము జేసినవారు నిశ్చయముగ శిక్షార్హులు. రావణాసురుడు బ్రహ్మవరములు పొందిన గర్వముచే కైలాసమునెత్తుటకు ప్రయత్నించి మీకపరాధముసల్పెను. అట్టిపాపోపశమనమునకు మిమ్ములను స్తుతించి తనగానముచే మిమ్ము మెప్పించి మీవద్ద రహస్య ఉపదేశము పొంది కాశీ వెళ్ళి గౌరీకుండస్నానము, కేదారేశ్వర దర్శన అర్చనలతో పాపనివృత్తి పొందెను. ఆ శాపమును మీరునూ తొలగించలేని కారణమున మీకత్యంతభక్తుడయిననూ కులముతో సహానాశము పొందెను.
మీభక్తసిఱోమణి ఈ దూర్వాసుడు మీచే ప్రసాదింపబడిన మాలను ఇంద్రునకు ఇవ్వగా అతడు దానిని భక్తితో స్వీకరింపక గర్వముతో ఐరావతము తలపై వేసెను. ఆ ఏనుగు మదముతో దానిని వేలపై విసిరి తొక్కివేసెను. ఇంద్రుడీ సంయమీంద్రుని వాక్కుతోనైననూ స్తుతింపక శాపగ్రస్తుడై రాజ్యభ్రష్ఠుడై, దుఃఖితుడై, రాక్షస భయముచే మందర పర్వత గుహలో తలదాచుకొని కడకు మునీంద్రుని శరణుజొచ్చి, ఇతడు దచతలచి ఉపదేశము చేయగా కాశీవెళ్ళి గౌరీకుండ క్నానము, కేదారేశ్వరుని అర్చనతో మీభక్తులకొనర్చిన అపరాధమునుండి ముక్తుడాయెను. మహాయోగిపుంగవుడు గౌతముడు మీభక్తాగ్రగణ్యుడు. ఇతనికి అపరాధము చేసి ఇంద్రుడు సహస్రయోనిజుడై నపుంసకుడాయెను గదా! దేవతల ఎగతాఱికి గురై బుధ్ధిగల్గి ఇతని ఏకాంతమున శరణుజొచ్చి క్షమింపవేడగా గౌతముడు కరుణించి కాశీలో గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చనము వలన మరల పుంసత్వము గల్గునని శుభము గల్గునని ఉపదేశింపగా అతడట్లేచేసి మరల అసురులను గెల్చి స్వర్గాధిపత్యము పొందెను. బాణుడు మీభక్తుడయినను కణ్వమహామునిని అనాదరించి సర్వమును కోల్పోయెను. యదువంశజులు కృష్ణుని ద్వేషించి యుద్ధమునకు వెళ్ళబోవగా వారికి కృష్ణుడు పాశుపతుడని తెలియజెప్పి అతని మనుమని వదలివేయమని బోధించితిరి. భక్తుని ద్వేషించువారిని శంకరుడునూ రక్షింపడు. కణ్వుడు ఏకాంతమున బాణునకు మంచి బోధించిననూ వినక మదగర్వముతో గురుధిక్కారము జేసి ఎదిరించి తనసహస్రబాహువులను గోల్పోయి రెండు భుజములవాడాయెను. అపుడు శుక్రాచార్యుడు బుద్ధిచెప్పి కణ్వమహర్షి శరణుజొచ్చి శివభక్తులకు అపరాధమొనరించి ఈ అనర్ధము తెచ్చికొంటినని చెప్పి ప్రార్ధించమని హితవుపలుకగా యుద్ధ భూమియందున్న బాణుడు మానసికముగ కణ్వమహర్షిని ప్రార్ధించెను. మహర్షి దానిని స్వీకరించి ప్రసన్నుడై అతనిని కాపాడమని శంకరుని వేడెను. తనభక్తుని అనాదరణకు కోపించిన శంకరుడు మహర్షి ప్రార్ధనకు శాంతించి వానినట్లు రెండు భుజములతో వదలి కాశీకి వెళ్ళి కేదారేశ్వరుని ఎదుట గౌరీకుండమున స్నానమాడి కేదారేశ్వరుని అర్చించి పాపవిముక్తుడవైనన్ను చేరగలవని కరుణించెను. బాణుడట్లేచేసి తనపేర శివలింగ స్థాపన జేసి శివపదము జేరి గణములలో ముఖ్యుడాయెను.
ఇంకనూ ఈ ఉపమన్యుమహాత్ముని చంద్రుడు పరిహసించి క్షీణబలుడయ్యెను. శివప్రసాద బలమున ఇతడు క్షీరసాగర మానము జేయబోగా చంద్రుడు నవ్వి పరిహాసముగా, ఎంతత్రాగగలవు?బ్రాహ్మణుని ఆశకు హద్దులేదు. సముద్రమెంత! నీవెంత! సముద్రమును పానము జేయగలవా? శివునికి కూడ బుద్ధి చాంచల్యము చేనీకు సముద్రునిచ్చెను. అని హేళనచేయగా ఉపమన్యు కోపించి మూఢుడా, శివభక్తుల ప్రతాపను నీవెరుంగవు. శివ భక్తాగ్రగణ్యుడు, యోగిపుంగవుడు, ఘటమున అంగుష్ఠమాత్రమూగా ఉద్భవించిన అగస్త్యమహర్షి ఈ సముద్రమును జలబిందువుగా కరమున గ్రహించి ఆచమనము చేసెను, మరల అల్పాచమనముగా విడిచినందున సముద్రము అపవిత్రమైనది. మహోన్నతుడయిన వింధ్యపర్వతమేమైనది? ఉత్వలుడు, వాతాపి ఎమైరి? ఒక్క వాక్కుతో మరణించిరి. నీవు అత్రిపుత్రుడవై, శివుని తలనెక్కి, క్షీరసాగరమున ఉద్భవించి, మూడులోకములను ఆనందపరచుచు నక్షత్రరాజువైననూ, గురుతల్పదోషమునకు శివుడు కోపించి నిన్ను సమాప్తిగావించతలంచెనుగాని మీమాత అనసూయ పార్వతికి ఇష్టురాలైనందున తల్లి కోరికపై శంకరుడు నిన్ను వదిలివేయగా ఆతల్లి నిన్ను రక్షించుకొనెను. గనుక బ్రాహ్మణుని అవమానించిన ఫలితము నీవిప్పుడే అనుభవింతువని పల్కి ఉపమన్యు వెళ్ళిపోయెను. అదేసమయమున గణపతి తన ఎలుగ వాహమనుపై మేరుపర్వతమున తోటి బాలురతో విహారమునకు వెళ్ళగా చంద్రుడతనిని చూచి పరిహసించెను. ఎలుక వాహనము పర్వతము అంచున పరుగెత్తుచూ జీరి పడిపోగా గణేశుడు నేలపై పడుటచూచి చంద్రుటు వికట్టహాసము జేసెను. గణపతి దానిని సహింపలేక కోపించి మనోదృష్ఠిచే భస్మము చేయనెంచి చంద్రుని చూచి మూఢా! ఈనాటినుండి నీప్రకాశము క్షీణించి దేవతలు నిన్ను మింగివేయుదురు. నిన్ను చూచిన త్రిలోకవాసులు అవమానములు పొందెదరు. అని లోకపాలకులను చంద్రుని కళలను మ్రింగివేయుడని ఆజ్ఞాపించెను. వెంటనే మొదట అగ్ని, తరువాత సూర్యుడు, విశ్వేదేవుడు, సముద్రుడు, వషట్కారుడు, ఇంద్రుడు, దేవర్షులు, అజైకపాదుడు, యముడు, పవనుడు, శక్తి, పితరులు, కుబేరుడు, శివుడు, బ్రహ్మ ఇట్లు 15 కళలు 15మంది లాగవేయగా గణపతి చంద్రుని 16వ కళను విష్ణుమూర్తికిచ్చెను. కాని విష్ణుమూర్తి దానిని హరింపక, దయతో గణపతిని మహానుభావా త్రైలోక్యవాసులు చంద్రుడు లేక జీవింపలేరు. ఒక్క కళతోనైనను ఇతనిని బ్రతకనిండు. అపరాధులకు మీరేదిక్కు అని వేడగా గణపతి, ఈతడు శివభక్తులనవమానించినాడు. నాభక్తుల అవమానము నా అవమానముకన్న గొప్పది. కనుక నాభక్తుడే అతనికి దిక్కు లేనిచో ఇతని గతికి ఇతనిని వదిలివేయవలసినదే. అనగా చంద్రుడు భయముచే కంపించి విష్ణువును ప్రార్ధించి సముద్ర గర్భమున యున్న ఉపమన్యు చరణములపై వ్రాలి రక్షింపప్రార్ధించెను. అపుడు ఉపమన్యు శాంతించి నవ్వుచు, నీకు శుభమగుగాక! నీవు గణేశుని కూడ అవమానించినందున వెంటనే వెళ్ళి ఆయన శరణు వేడమని పంపెను. చంద్రుడు విష్ణుమూర్తి సహాయమున గణేశుని శరణుజొచ్చి బ్రతికింపగోరెను. అపుడు గణపతి కరుణించి, అల్పుడా! నా అవమానము, మా మాతా పితరుల అవమానము కంటె మాభక్తుల అవమానము సహింపరానిది. నీవు వెంటనే కాశీకి వెళ్ళి అక్కడ కేదారేశ్వరుని ఎదురుగానున్న గౌరీకుండమున స్నానముజేసి కేదారేశ్వరుని పూజించి నీపేర లింగప్రతిష్ఠచేసి నిత్యము పూజించుచున్నయడల క్షీణించిన ఒక్కొక్కకళను క్రమ క్రమముగ మరల పొందగలవు. ఇట్లు 15గురు దేవతలచే భక్షింపబడుచు మరల పొందుచు జీవింతువు. మాభక్తులను అవమానించినందులకు నీకీశాస్తి తప్పదని చంద్రుని విష్ణుమూర్తితో సహా కాశీకి పంపెను. చంద్రుడు గణేశుని ఆజ్ఞనిర్వర్తించి జీవించుచుండెను.
నారదుడికనూ, తల్లీ! నీకు తెలియనిదేమి, నీ పూర్వజన్మ జనకుడు దక్షప్రజాపతి, శ్వభక్తుడయినను సభలో దధీచి నవమీనించి ఎగతి పొందెను! అతనిని నిందించిన కారణమున యజ్ఞము ఒక్క క్షణములో భంగమై అతనికి సహాయము జేయబోయిన సూర్యుడు పండ్లువిరిగిన వాడాయెను. దక్షునకు మేకతల ప్రాప్తించి అట్లే శివాజ్ఞపై కాశీకి వెళ్లి గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చన, తనపేర శివలింగస్థాపన పూజల వలన, మేకతలతో తిరిగి వచ్చి "చమక" మన్నపర శివస్తుతి జేసి మరల తనపదవిని పొందెను.
ఇక ఈ భృగుమహర్షి మీ భక్తాగ్రగణ్యుడు. పుణ్యాత్ముడు. విష్ణుమూర్తి మొదట ఇతని భార్యను చంపి పాపమాచరించెను. అట్టి అపరాధమునకు విష్ణుమూర్తి జన్మలనెత్తవలసి వచ్చినది. కాని మీకృపవలన దశావతారములతో పాప పరిహారమైనది. మరల జన్మలేకుండ వరము పొందినను భృగు భార్యా వియోగ దోషమున విష్ణువు రామావతారమున భార్యా వియోగమనుభవింపవలసి వచ్చినది. తదుపరి శివాజ్ఞపై కాశీలో గౌరీకుండస్నానము, కేదారేశ్వర పూజలు, అభిషేకముజేసి, తనపేర లింగప్రతిష్ఠజేసి నివృత్తి పొందెను.
ఇక అంగీరసముని విషయమున, పూర్వము నహుషుడను రాజేంద్రుడు విధివిధానముగ యజ్ఞముచేసి ప్రజారంజకముగ పాలన జేసెను. యజ్ఞమందు ఏనుగు తొంజమంత వశోధారతో 12 వర్షములు అగ్నిదేవుని తృప్తి పరచగా అగ్నికి అజీర్ణరోగము వచ్చెను. సర్వభక్షకుడగు అగ్నియే అజీర్ణరోగవిముక్తికి బ్రహ్మను ప్రార్ధించెను. బ్రహ్మ ఆలోచించి నహుషుని దివ్య యజ్ఞమునకు చకితుడై అగ్నిదేవుని ఆజీర్తి శాంతింపజేయుటకై, పృధ్విపైగల ఇంద్రుని ఖాండవవనమందు అజీర్తి ఉపశాంతికి తగిన ఓషధులు గలవు దానిని భక్షింపుమనిచెప్పి, దానిని చేరుట కష్టమయిననూ ప్రయత్నింపుమనెను. అగ్ని వెంటనే వెళ్ళి దహింపబూనగా ఇంద్రుడు మేఘముల నాదేశించి అగ్నిని ఆర్పివేసెను. ఎన్నిమార్లు ప్రయత్నించిననూ మేఘములతో గెలువలేక అగ్ని మరల బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకొనెను. బ్రహ్మ మరొక ఉపాయమాలోచించి విష్ణుమూర్తి అంశతో నరనారాయణులు కృష్ణార్జులులుగా పృధ్విపై అవతరించియున్నారు. వారిని శరణుజొచ్చి ప్రార్ధించి ఖాండవ దహనమునకు నీకు సహాయము చేయమని కోరుమని సలహా యిచ్చిరి. అగ్ని అట్లేచేసి తన అజీర్తి ఉపశమింపజేసికొనెను. అంతటి ప్రతిభావంతుడు నహుషుడొకమారు స్వర్గమునకు వెళ్ళగా ఇంద్రుడతనిని పూజించి , తనకు సమానముగా ఆసనమిచ్చి గౌరవించెను.
ఒకమారు ఇంద్రుడు వృతాసురుని చంపి భయముతో అదృశ్యుడైన సమయమున దేవతలు ఇంద్ర సభలో సింహాసనము ఖాళీగా యుండకూడదని ఇంద్రుడు వచ్చువరకు నహుషుని ఇంద్ర సింహాసనమున అభిషేకించిరి. నహుషుడు మదగర్వితుడై శచీదేవిపై మనసుపడి, భర్తజాడ తెలియక దుఃఖించుచున్న శచీదేవిని బలాత్కరించెను. అపుడు బృహస్పతి నహుషునితో, సచీదేవి పతివ్రత, తత్కాల సింహాసనాధిష్టత గర్వముతో శచీదేవినాసింపరాదని హితవు పలికి తన తండ్రిని అంగీరసునితో కూడ నహుషుని హెచ్చరింపమని పంపెను. నహుషుడు ఈ మహా యోగిపుంగవుని మాట నిరాదరించిన కారణమున ఇతడు కోపించి అధోగతి పాలగుదువని శపించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. నహుషుడు కొండచిలువగా భూమిపై పడెను. 10 వేల సంవత్సరములు సర్పముగా పడియుండి, హిమాలయ బిలములలో తపమాచరించు భక్తులను భక్షించి ఆకలి తీర్చుకొనుచుండెను. ఒకపరి పాంజు కుమారుడు భీముని మ్రింగివేయగా ధర్మరాజు తెలిసికొని అక్కడకు వచ్చి హేపాపీ! నా చిన్న తమ్ముడు భీముని మ్రింగితివి. నేను ధర్మరాజును. పాపఫలముగా పాము జన్మనెత్తియూ శివభక్తుల జంపుట నీ పూర్వజన్మపు శివభక్తులయడలి అపరాధమై యుండును. ఇపుడు నీవు మ్రింగిన నా తమ్ముడు భీముని వెడల గ్రక్కిన యడల నీకు మంచి జరుగును. శంభుని కృపవలన నీ కష్టములు తీరునని ధర్మరాజు చెప్పగా, అతని నోటినుండి శంభుని పదము చెవిని పడిన వెంటనే, ఆ అజగరమునకు పూర్వ స్మృతి గల్గి, భీముని వెడల గ్రక్కి యుధిష్టిరునితో, కుమారా! నేను మీవంశమునందు ప్రధముడను, నహుష చక్రవర్తిగా కీర్తింపబడినవానిని. అకారణముగా అగస్త్య, అంగీరసులతో ద్వేషము పెంచుకొని, ఆ శివభక్తులను అవమానించి ఈగతి తెచ్చుకొంటిని. వారిని ప్రార్ధించి ప్రసన్నులను జేసి నన్ను ఉద్ధరింపుమని బ్రతిమాలెను.
అపుడు ధర్మరాజు అంగీరసుని ఆదరపూర్వకముగ ప్రార్ధించి, అగస్త్యుని పూజించి నహుషుని అపరాధము మన్నింపుమని వేడగా, వారు ధర్మరాజుకు ఉపదేశము జేసి కాశీలో హరంపాప తీర్థస్నానము, కేదారేశ్వరుని అర్చనలవలన వాంఛితార్ధము సిద్ధించి నహుషుని పేర, ధర్మరాజుపేర లింగప్రతిష్ఠలు చేయుమని ఆదేశించిరి. ధర్మరాజట్లేచేసి నహుషుని ఉద్ధరించి తాను ముక్తుడాయెను. ఇట్లు శూర, పద్మ, కారణ్యాది దేత్యులెందరో బ్రాహ్మణ ద్రోహము జేసి గౌరీకుండ, ప్రాచీన గుప్త తీర్థ స్నానము, కేదారేశ్వర అర్చనల వలన ముక్తులైరి. విశ్వేశ్వర, మణికర్ణికల వలన కూడ అలవికాని పాపహరము, శివాపరాధ దోషనివృత్తి, హరంపాప తీర్థస్నాన, శ్రీకేదారేశ్వరుల అర్చనలవలన మాత్రమే నివృత్తి యగునని తెల్పి, తల్లీ శివుని కర్త, అకర్త, అన్యధాకర్త లీలలు నీ నిగ్రహానుగ్రహ ప్రసాదముల వలన జరుగని దేమున్నది. నేను చెప్పతరమా యని నారదుడు, తక్కిన బ్రాహ్మణులతో చేరి తలయొక్కి నమస్కరించి తల్లి అనుజ్ఞపై వారి స్థానములకు జేరిరి. కాశీక్షేత్ర తీర్థములు, విశ్వేశ్వర కేదారలింగములు దుస్తర దోషనివారకములు. శివభక్తులకు ముక్తిదాయకములు. ఆ సమయమున అక్కడ దేవి సన్నిధిలో నారదునిచే అమ్మవారికి వినిపింపబడిన ఈ వృత్తాంతమంతయు విని మేనక స్వర్గము చేరి దుర్ధరునితో అనునయముగా చింతించవలదనియూ, పాపపరిహారమున్నదనియూ తెల్పిన ఈశివ భక్తాగ్రగణ్యుల విశేష వైచిత్ర్యములను వినినవారు శివలోకము చేరుట తధ్యము. మేనక దుర్ధరునకు తాను దేవ బ్రాహ్మణులతో కూడి పరాంబిక వద్ద వినిన శివభక్తాగ్రగణ్యుల ప్రభావము, శివాపరాధుల పాప పరిహార మార్గములను వివరించి అతనికి ధైర్యము చెప్పి అతనినుద్ధరింప తలంచెను.
దేవకన్య మేనక దుర్ధనునెట్లు ఉద్ధరించుటాయని ఆలోచించి అతనినోదార్చి తను కైలాసమందు పరాశక్తి దర్శనము చేసికొనివచ్చువరకు అతనినక్కడే ఉండమని చెప్పి వెళ్ళెను. కైలాసమందు శివభక్తులు దేవిసేవకై దుర్వాస, గౌతమ, కణ్య, దధీచి, అంగిరస, భృగు, నారద, ఉపమన్యులు బ్రహ్మవాద శ్రేష్ఠులు ఎనమండుగురు మొదట శైలాదు గణేశ, కార్తికేయులను సేవించి తదుపరి పరమేశ్వరుని అర్చించి పరాశక్తిని పూజించుటకై అమ్మవారి వద్ద చేరిరి. అమ్మవారిని అనేక విధముల స్తుతించి తల్లి ఆజ్ఞమేరకు అక్కడ వేచియున్న సమయమున మేనక అక్కడకు చేరి వారందరకు నమస్కరించి అమ్మవారిని ఆనందపరచుటకై నాట్యము చేయనారంభించెను. పరాశక్తి చాలాకాలము నాట్యము చూచి ఆనందించి శివభక్తులనుద్దేశించి బ్రాహ్మణోత్తములారా ఎక్కడనుండి వచ్చినారు? ప్రపంచమున మీరు చూచిన గొప్ప ఆశ్చర్యకరమైన వింతలేమని ప్రశ్నించిరి. దానికి ముందుగా నారదమహర్షి తల్లీ! శివపార్వతులకు అపరాధము చేసినవారికైనను మంచి జరుగవచ్చును కాని మీభక్తులకపరాధము జేసినవారు నిశ్చయముగ శిక్షార్హులు. రావణాసురుడు బ్రహ్మవరములు పొందిన గర్వముచే కైలాసమునెత్తుటకు ప్రయత్నించి మీకపరాధముసల్పెను. అట్టిపాపోపశమనమునకు మిమ్ములను స్తుతించి తనగానముచే మిమ్ము మెప్పించి మీవద్ద రహస్య ఉపదేశము పొంది కాశీ వెళ్ళి గౌరీకుండస్నానము, కేదారేశ్వర దర్శన అర్చనలతో పాపనివృత్తి పొందెను. ఆ శాపమును మీరునూ తొలగించలేని కారణమున మీకత్యంతభక్తుడయిననూ కులముతో సహానాశము పొందెను.
మీభక్తసిఱోమణి ఈ దూర్వాసుడు మీచే ప్రసాదింపబడిన మాలను ఇంద్రునకు ఇవ్వగా అతడు దానిని భక్తితో స్వీకరింపక గర్వముతో ఐరావతము తలపై వేసెను. ఆ ఏనుగు మదముతో దానిని వేలపై విసిరి తొక్కివేసెను. ఇంద్రుడీ సంయమీంద్రుని వాక్కుతోనైననూ స్తుతింపక శాపగ్రస్తుడై రాజ్యభ్రష్ఠుడై, దుఃఖితుడై, రాక్షస భయముచే మందర పర్వత గుహలో తలదాచుకొని కడకు మునీంద్రుని శరణుజొచ్చి, ఇతడు దచతలచి ఉపదేశము చేయగా కాశీవెళ్ళి గౌరీకుండ క్నానము, కేదారేశ్వరుని అర్చనతో మీభక్తులకొనర్చిన అపరాధమునుండి ముక్తుడాయెను. మహాయోగిపుంగవుడు గౌతముడు మీభక్తాగ్రగణ్యుడు. ఇతనికి అపరాధము చేసి ఇంద్రుడు సహస్రయోనిజుడై నపుంసకుడాయెను గదా! దేవతల ఎగతాఱికి గురై బుధ్ధిగల్గి ఇతని ఏకాంతమున శరణుజొచ్చి క్షమింపవేడగా గౌతముడు కరుణించి కాశీలో గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చనము వలన మరల పుంసత్వము గల్గునని శుభము గల్గునని ఉపదేశింపగా అతడట్లేచేసి మరల అసురులను గెల్చి స్వర్గాధిపత్యము పొందెను. బాణుడు మీభక్తుడయినను కణ్వమహామునిని అనాదరించి సర్వమును కోల్పోయెను. యదువంశజులు కృష్ణుని ద్వేషించి యుద్ధమునకు వెళ్ళబోవగా వారికి కృష్ణుడు పాశుపతుడని తెలియజెప్పి అతని మనుమని వదలివేయమని బోధించితిరి. భక్తుని ద్వేషించువారిని శంకరుడునూ రక్షింపడు. కణ్వుడు ఏకాంతమున బాణునకు మంచి బోధించిననూ వినక మదగర్వముతో గురుధిక్కారము జేసి ఎదిరించి తనసహస్రబాహువులను గోల్పోయి రెండు భుజములవాడాయెను. అపుడు శుక్రాచార్యుడు బుద్ధిచెప్పి కణ్వమహర్షి శరణుజొచ్చి శివభక్తులకు అపరాధమొనరించి ఈ అనర్ధము తెచ్చికొంటినని చెప్పి ప్రార్ధించమని హితవుపలుకగా యుద్ధ భూమియందున్న బాణుడు మానసికముగ కణ్వమహర్షిని ప్రార్ధించెను. మహర్షి దానిని స్వీకరించి ప్రసన్నుడై అతనిని కాపాడమని శంకరుని వేడెను. తనభక్తుని అనాదరణకు కోపించిన శంకరుడు మహర్షి ప్రార్ధనకు శాంతించి వానినట్లు రెండు భుజములతో వదలి కాశీకి వెళ్ళి కేదారేశ్వరుని ఎదుట గౌరీకుండమున స్నానమాడి కేదారేశ్వరుని అర్చించి పాపవిముక్తుడవైనన్ను చేరగలవని కరుణించెను. బాణుడట్లేచేసి తనపేర శివలింగ స్థాపన జేసి శివపదము జేరి గణములలో ముఖ్యుడాయెను.
ఇంకనూ ఈ ఉపమన్యుమహాత్ముని చంద్రుడు పరిహసించి క్షీణబలుడయ్యెను. శివప్రసాద బలమున ఇతడు క్షీరసాగర మానము జేయబోగా చంద్రుడు నవ్వి పరిహాసముగా, ఎంతత్రాగగలవు?బ్రాహ్మణుని ఆశకు హద్దులేదు. సముద్రమెంత! నీవెంత! సముద్రమును పానము జేయగలవా? శివునికి కూడ బుద్ధి చాంచల్యము చేనీకు సముద్రునిచ్చెను. అని హేళనచేయగా ఉపమన్యు కోపించి మూఢుడా, శివభక్తుల ప్రతాపను నీవెరుంగవు. శివ భక్తాగ్రగణ్యుడు, యోగిపుంగవుడు, ఘటమున అంగుష్ఠమాత్రమూగా ఉద్భవించిన అగస్త్యమహర్షి ఈ సముద్రమును జలబిందువుగా కరమున గ్రహించి ఆచమనము చేసెను, మరల అల్పాచమనముగా విడిచినందున సముద్రము అపవిత్రమైనది. మహోన్నతుడయిన వింధ్యపర్వతమేమైనది? ఉత్వలుడు, వాతాపి ఎమైరి? ఒక్క వాక్కుతో మరణించిరి. నీవు అత్రిపుత్రుడవై, శివుని తలనెక్కి, క్షీరసాగరమున ఉద్భవించి, మూడులోకములను ఆనందపరచుచు నక్షత్రరాజువైననూ, గురుతల్పదోషమునకు శివుడు కోపించి నిన్ను సమాప్తిగావించతలంచెనుగాని మీమాత అనసూయ పార్వతికి ఇష్టురాలైనందున తల్లి కోరికపై శంకరుడు నిన్ను వదిలివేయగా ఆతల్లి నిన్ను రక్షించుకొనెను. గనుక బ్రాహ్మణుని అవమానించిన ఫలితము నీవిప్పుడే అనుభవింతువని పల్కి ఉపమన్యు వెళ్ళిపోయెను. అదేసమయమున గణపతి తన ఎలుగ వాహమనుపై మేరుపర్వతమున తోటి బాలురతో విహారమునకు వెళ్ళగా చంద్రుడతనిని చూచి పరిహసించెను. ఎలుక వాహనము పర్వతము అంచున పరుగెత్తుచూ జీరి పడిపోగా గణేశుడు నేలపై పడుటచూచి చంద్రుటు వికట్టహాసము జేసెను. గణపతి దానిని సహింపలేక కోపించి మనోదృష్ఠిచే భస్మము చేయనెంచి చంద్రుని చూచి మూఢా! ఈనాటినుండి నీప్రకాశము క్షీణించి దేవతలు నిన్ను మింగివేయుదురు. నిన్ను చూచిన త్రిలోకవాసులు అవమానములు పొందెదరు. అని లోకపాలకులను చంద్రుని కళలను మ్రింగివేయుడని ఆజ్ఞాపించెను. వెంటనే మొదట అగ్ని, తరువాత సూర్యుడు, విశ్వేదేవుడు, సముద్రుడు, వషట్కారుడు, ఇంద్రుడు, దేవర్షులు, అజైకపాదుడు, యముడు, పవనుడు, శక్తి, పితరులు, కుబేరుడు, శివుడు, బ్రహ్మ ఇట్లు 15 కళలు 15మంది లాగవేయగా గణపతి చంద్రుని 16వ కళను విష్ణుమూర్తికిచ్చెను. కాని విష్ణుమూర్తి దానిని హరింపక, దయతో గణపతిని మహానుభావా త్రైలోక్యవాసులు చంద్రుడు లేక జీవింపలేరు. ఒక్క కళతోనైనను ఇతనిని బ్రతకనిండు. అపరాధులకు మీరేదిక్కు అని వేడగా గణపతి, ఈతడు శివభక్తులనవమానించినాడు. నాభక్తుల అవమానము నా అవమానముకన్న గొప్పది. కనుక నాభక్తుడే అతనికి దిక్కు లేనిచో ఇతని గతికి ఇతనిని వదిలివేయవలసినదే. అనగా చంద్రుడు భయముచే కంపించి విష్ణువును ప్రార్ధించి సముద్ర గర్భమున యున్న ఉపమన్యు చరణములపై వ్రాలి రక్షింపప్రార్ధించెను. అపుడు ఉపమన్యు శాంతించి నవ్వుచు, నీకు శుభమగుగాక! నీవు గణేశుని కూడ అవమానించినందున వెంటనే వెళ్ళి ఆయన శరణు వేడమని పంపెను. చంద్రుడు విష్ణుమూర్తి సహాయమున గణేశుని శరణుజొచ్చి బ్రతికింపగోరెను. అపుడు గణపతి కరుణించి, అల్పుడా! నా అవమానము, మా మాతా పితరుల అవమానము కంటె మాభక్తుల అవమానము సహింపరానిది. నీవు వెంటనే కాశీకి వెళ్ళి అక్కడ కేదారేశ్వరుని ఎదురుగానున్న గౌరీకుండమున స్నానముజేసి కేదారేశ్వరుని పూజించి నీపేర లింగప్రతిష్ఠచేసి నిత్యము పూజించుచున్నయడల క్షీణించిన ఒక్కొక్కకళను క్రమ క్రమముగ మరల పొందగలవు. ఇట్లు 15గురు దేవతలచే భక్షింపబడుచు మరల పొందుచు జీవింతువు. మాభక్తులను అవమానించినందులకు నీకీశాస్తి తప్పదని చంద్రుని విష్ణుమూర్తితో సహా కాశీకి పంపెను. చంద్రుడు గణేశుని ఆజ్ఞనిర్వర్తించి జీవించుచుండెను.
నారదుడికనూ, తల్లీ! నీకు తెలియనిదేమి, నీ పూర్వజన్మ జనకుడు దక్షప్రజాపతి, శ్వభక్తుడయినను సభలో దధీచి నవమీనించి ఎగతి పొందెను! అతనిని నిందించిన కారణమున యజ్ఞము ఒక్క క్షణములో భంగమై అతనికి సహాయము జేయబోయిన సూర్యుడు పండ్లువిరిగిన వాడాయెను. దక్షునకు మేకతల ప్రాప్తించి అట్లే శివాజ్ఞపై కాశీకి వెళ్లి గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చన, తనపేర శివలింగస్థాపన పూజల వలన, మేకతలతో తిరిగి వచ్చి "చమక" మన్నపర శివస్తుతి జేసి మరల తనపదవిని పొందెను.
ఇక ఈ భృగుమహర్షి మీ భక్తాగ్రగణ్యుడు. పుణ్యాత్ముడు. విష్ణుమూర్తి మొదట ఇతని భార్యను చంపి పాపమాచరించెను. అట్టి అపరాధమునకు విష్ణుమూర్తి జన్మలనెత్తవలసి వచ్చినది. కాని మీకృపవలన దశావతారములతో పాప పరిహారమైనది. మరల జన్మలేకుండ వరము పొందినను భృగు భార్యా వియోగ దోషమున విష్ణువు రామావతారమున భార్యా వియోగమనుభవింపవలసి వచ్చినది. తదుపరి శివాజ్ఞపై కాశీలో గౌరీకుండస్నానము, కేదారేశ్వర పూజలు, అభిషేకముజేసి, తనపేర లింగప్రతిష్ఠజేసి నివృత్తి పొందెను.
ఇక అంగీరసముని విషయమున, పూర్వము నహుషుడను రాజేంద్రుడు విధివిధానముగ యజ్ఞముచేసి ప్రజారంజకముగ పాలన జేసెను. యజ్ఞమందు ఏనుగు తొంజమంత వశోధారతో 12 వర్షములు అగ్నిదేవుని తృప్తి పరచగా అగ్నికి అజీర్ణరోగము వచ్చెను. సర్వభక్షకుడగు అగ్నియే అజీర్ణరోగవిముక్తికి బ్రహ్మను ప్రార్ధించెను. బ్రహ్మ ఆలోచించి నహుషుని దివ్య యజ్ఞమునకు చకితుడై అగ్నిదేవుని ఆజీర్తి శాంతింపజేయుటకై, పృధ్విపైగల ఇంద్రుని ఖాండవవనమందు అజీర్తి ఉపశాంతికి తగిన ఓషధులు గలవు దానిని భక్షింపుమనిచెప్పి, దానిని చేరుట కష్టమయిననూ ప్రయత్నింపుమనెను. అగ్ని వెంటనే వెళ్ళి దహింపబూనగా ఇంద్రుడు మేఘముల నాదేశించి అగ్నిని ఆర్పివేసెను. ఎన్నిమార్లు ప్రయత్నించిననూ మేఘములతో గెలువలేక అగ్ని మరల బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకొనెను. బ్రహ్మ మరొక ఉపాయమాలోచించి విష్ణుమూర్తి అంశతో నరనారాయణులు కృష్ణార్జులులుగా పృధ్విపై అవతరించియున్నారు. వారిని శరణుజొచ్చి ప్రార్ధించి ఖాండవ దహనమునకు నీకు సహాయము చేయమని కోరుమని సలహా యిచ్చిరి. అగ్ని అట్లేచేసి తన అజీర్తి ఉపశమింపజేసికొనెను. అంతటి ప్రతిభావంతుడు నహుషుడొకమారు స్వర్గమునకు వెళ్ళగా ఇంద్రుడతనిని పూజించి , తనకు సమానముగా ఆసనమిచ్చి గౌరవించెను.
ఒకమారు ఇంద్రుడు వృతాసురుని చంపి భయముతో అదృశ్యుడైన సమయమున దేవతలు ఇంద్ర సభలో సింహాసనము ఖాళీగా యుండకూడదని ఇంద్రుడు వచ్చువరకు నహుషుని ఇంద్ర సింహాసనమున అభిషేకించిరి. నహుషుడు మదగర్వితుడై శచీదేవిపై మనసుపడి, భర్తజాడ తెలియక దుఃఖించుచున్న శచీదేవిని బలాత్కరించెను. అపుడు బృహస్పతి నహుషునితో, సచీదేవి పతివ్రత, తత్కాల సింహాసనాధిష్టత గర్వముతో శచీదేవినాసింపరాదని హితవు పలికి తన తండ్రిని అంగీరసునితో కూడ నహుషుని హెచ్చరింపమని పంపెను. నహుషుడు ఈ మహా యోగిపుంగవుని మాట నిరాదరించిన కారణమున ఇతడు కోపించి అధోగతి పాలగుదువని శపించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. నహుషుడు కొండచిలువగా భూమిపై పడెను. 10 వేల సంవత్సరములు సర్పముగా పడియుండి, హిమాలయ బిలములలో తపమాచరించు భక్తులను భక్షించి ఆకలి తీర్చుకొనుచుండెను. ఒకపరి పాంజు కుమారుడు భీముని మ్రింగివేయగా ధర్మరాజు తెలిసికొని అక్కడకు వచ్చి హేపాపీ! నా చిన్న తమ్ముడు భీముని మ్రింగితివి. నేను ధర్మరాజును. పాపఫలముగా పాము జన్మనెత్తియూ శివభక్తుల జంపుట నీ పూర్వజన్మపు శివభక్తులయడలి అపరాధమై యుండును. ఇపుడు నీవు మ్రింగిన నా తమ్ముడు భీముని వెడల గ్రక్కిన యడల నీకు మంచి జరుగును. శంభుని కృపవలన నీ కష్టములు తీరునని ధర్మరాజు చెప్పగా, అతని నోటినుండి శంభుని పదము చెవిని పడిన వెంటనే, ఆ అజగరమునకు పూర్వ స్మృతి గల్గి, భీముని వెడల గ్రక్కి యుధిష్టిరునితో, కుమారా! నేను మీవంశమునందు ప్రధముడను, నహుష చక్రవర్తిగా కీర్తింపబడినవానిని. అకారణముగా అగస్త్య, అంగీరసులతో ద్వేషము పెంచుకొని, ఆ శివభక్తులను అవమానించి ఈగతి తెచ్చుకొంటిని. వారిని ప్రార్ధించి ప్రసన్నులను జేసి నన్ను ఉద్ధరింపుమని బ్రతిమాలెను.
అపుడు ధర్మరాజు అంగీరసుని ఆదరపూర్వకముగ ప్రార్ధించి, అగస్త్యుని పూజించి నహుషుని అపరాధము మన్నింపుమని వేడగా, వారు ధర్మరాజుకు ఉపదేశము జేసి కాశీలో హరంపాప తీర్థస్నానము, కేదారేశ్వరుని అర్చనలవలన వాంఛితార్ధము సిద్ధించి నహుషుని పేర, ధర్మరాజుపేర లింగప్రతిష్ఠలు చేయుమని ఆదేశించిరి. ధర్మరాజట్లేచేసి నహుషుని ఉద్ధరించి తాను ముక్తుడాయెను. ఇట్లు శూర, పద్మ, కారణ్యాది దేత్యులెందరో బ్రాహ్మణ ద్రోహము జేసి గౌరీకుండ, ప్రాచీన గుప్త తీర్థ స్నానము, కేదారేశ్వర అర్చనల వలన ముక్తులైరి. విశ్వేశ్వర, మణికర్ణికల వలన కూడ అలవికాని పాపహరము, శివాపరాధ దోషనివృత్తి, హరంపాప తీర్థస్నాన, శ్రీకేదారేశ్వరుల అర్చనలవలన మాత్రమే నివృత్తి యగునని తెల్పి, తల్లీ శివుని కర్త, అకర్త, అన్యధాకర్త లీలలు నీ నిగ్రహానుగ్రహ ప్రసాదముల వలన జరుగని దేమున్నది. నేను చెప్పతరమా యని నారదుడు, తక్కిన బ్రాహ్మణులతో చేరి తలయొక్కి నమస్కరించి తల్లి అనుజ్ఞపై వారి స్థానములకు జేరిరి. కాశీక్షేత్ర తీర్థములు, విశ్వేశ్వర కేదారలింగములు దుస్తర దోషనివారకములు. శివభక్తులకు ముక్తిదాయకములు. ఆ సమయమున అక్కడ దేవి సన్నిధిలో నారదునిచే అమ్మవారికి వినిపింపబడిన ఈ వృత్తాంతమంతయు విని మేనక స్వర్గము చేరి దుర్ధరునితో అనునయముగా చింతించవలదనియూ, పాపపరిహారమున్నదనియూ తెల్పిన ఈశివ భక్తాగ్రగణ్యుల విశేష వైచిత్ర్యములను వినినవారు శివలోకము చేరుట తధ్యము. మేనక దుర్ధరునకు తాను దేవ బ్రాహ్మణులతో కూడి పరాంబిక వద్ద వినిన శివభక్తాగ్రగణ్యుల ప్రభావము, శివాపరాధుల పాప పరిహార మార్గములను వివరించి అతనికి ధైర్యము చెప్పి అతనినుద్ధరింప తలంచెను.
Saturday, February 7, 2009
షోడశోధ్యాయము
శౌనకాదులు మరల సూతునిట్లు కోరిరి. రోమహర్షణుని పుత్రులు, శివజ్ఞాన సముద్రులు యగు మహాత్మా దివోదాస చక్రవర్తి యశస్సు దేవ సభలో ప్రశంసా పాత్రమయినది. శివుని కృపచే కాశీ రాజయి పృధ్విని ఏకచ్ఛత్రాధిపత్యముగ పాలించిన దివోదసు శివాపరాధమెట్లు చేసెను?దయతో వినిపిమపుడని కోరిరి. అపుడు సూతుడిట్లు చెప్ప దొడగెను.
శివభక్తాగ్రగణ్యులగు బ్రాహ్మణులారా వినుడు. దివోదాసు బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి వరములు పొంది కాశీ రాజయ్యెను. బ్రహ్మ అతనిపై ఏ దేవతల ప్రభావము లేకుండ తాను పృధ్విని తన స్వయంశక్తిచే రక్షించ గల్గునట్లు వరమొసంగెను. తర్వాత బ్రహ్మ దేవుడు దివోదాసుకు తానిచ్చిన వరమును తెల్పి, ప్రార్థించి శివుని మందరాచలము వెళ్ళవలసినదికా కోరెను. శివుడు తన భక్తుడగు బ్రహ్మ వరమును కాపాడుటకై సర్వదేవతలతో కూడ మందరాచలము చేరెను.
దివోదాసు పంచ భూతముల శక్తులను తాను కైవశము జేసికొని వేరు దేవతల ప్రభావము లేకుండ, తన తపోబలమున నిరాటంకముగ రాజ్యమేలుట సహించలేని పంచభూతములు అతనిచే ఎట్లయినను ధర్మలోపము జేయించుటకై ఈర్ష్యజెందిరి. పంచభూతములు వారి పనులను నిర్వర్తించకుండుట యోగముద్వారా గ్రహించిన దివోదాసు తన తపో, యోగ ప్రభావమున అందరు దేవతల కార్యములను తానే నిర్వర్తించుచు రాజ్య మేలెను. ఇది తెలిసికొనిన పురోహితులు, భృగుమహర్షి బ్రహ్మాండమున శి శక్తిలేని ప్రదేశముండదు. కాని కాశిలో దివోదాసు అట్టి శక్తిని నిరోధించుట అపరాధమని ఎంచి, అతనికి శుభము గల్గుటకై మంచి మాటలతో శివశక్తిలేనిచో నీవు ఎంతోకాలము రాజ్యము చేయలేవని తెల్పెను.
దివోదాసు నవ్వుచూ ఏదియునూ శాశ్వతము గాదు. పూర్వ జన్మమున నేను తపస్సు జేసి శివుని మెప్పిమచి అపూర్వ వరములచే భోగములందు విరక్తి జెందితిని. తపోబలమున పొందిన శక్తి వ్యర్ధము కానిదే జన్మ అంతము కాదు. కనుక నేను శివాపరాధముచే శక్తిహీనుడనై శివుని చేతరింపబడుటకై నా రాజ్య భంగమునకు శివుడెట్టి ప్రయత్నములు జేయునో తెలిసికొనుటకు ఇట్లు ప్రవర్తించుచుంటిననెను. శివునికి ప్రీతకరమైనది, విహారభూమి, ఆత్మ భూతమైనది అట్టి కాశీ వియోగమును భరించలేని శంకరుడు బ్రహ్మాది దేవతలతో చేరి మరల కాశీ చేరుటకు ఎట్టి ప్రయత్నములు చేయునో చూతమను కొనెను. శివుడు పరాశక్తితో ఆలోచన సాగించి, దివోదాసు స్వధర్మచారి, బ్రహ్మ వరము పొందిన బ్రాహ్మణ భక్తుడు. పూర్వ జన్మలో ఏకాంత భక్తితో నాపూజ సల్పి మహాయోగ విభూతి పొందినవాడు. అట్టివాడు నేను కాశీ వియోగము భరించలేనని తలిసియూ నన్ను కాశీనుండి దూరము చేసెనని విచారించగా, పరాశక్తి, నాథా! తెలియక చేసిననూ శివాపరాధము దావానలము వంటిది. ఇక తెలిసి చేయు యీదివోదాస శివాపరాధమున ఇతని శక్తి త్వరితముగ నశించి రాజ్య భ్రష్టుని చేయును. కనుక యోగినీ గణములు, ఆదిత్య, గణేశ, విఘ్నేశ,బ్రహ్మ, విష్ణు మూర్తుల ద్వారా కాశీలో ధర్మ విచ్ఛేదము చేయించి అతని శక్తిని హరింతు మనెను. శివుడు దేవి చెప్పిన విధముగ వారిని నియమించగా, శివుని హృదయమున తాపముద్భవించిన కారణమున దివోదాసు భోగము లన్నియూ క్షణకాలమున నశించెను.
మహావిష్ణువు బుద్ధరూపమున, ధర్మపురమయిన కాశీలో అధర్మమునకు చోటు కల్పించుటచే దివోదాసు ధర్మచ్యుతుడై రాజ్యమును వదలివేసెను. అతని గురువు భృగుమహర్షి అతనిచే ప్రాచీన మణి కర్ణికలో స్నానము చేయించి, కేదారనాధును పూజింపజేసి పాపరహితుడై శివధామము చేరునట్లు చేసెను. ఈ వృత్తాంతముంతయు విని, వామదేవుడు బ్రహ్మవేత్త యగు సనత్కుమారునిట్లు ప్రశ్నించిరి. ప్రభో! దివోదాసు క్రింతం జన్మలో ఏవరుగా నుండి అనితర సాధ్యమగు తపమాచరించి గొప్ప వరములు పొందిరో శలవిండనగా సనత్కుమారులిట్లు తెల్పిరి.
పూర్వకాలమున కాంచీ పురములో విప్ర ప్రసాదుడను పేర ఒక వర్తకుడు ధనికుడు, వేదవిజ్ఞుడు, దేవ బ్రాహ్మణ భక్తుడు, నిత్యము ఏకామ్రనాథ కామాక్షీ దేవులను ఉపాసించి గొప్ప పుణ్యము సంపాదించెను. అతడొక వేశ్వద్వార పుత్ర వంతుడాయెను. ఆ వేశ్యకు వేరు సంతానము లేనందున వారీబిడ్డను అతి గారాబముగా పెంచి కాలవశమున గతించిరి. అతని పేరు దుర్దవుడు. తండ్రి గతించిన తర్వాత ధనవంతుడగుటచే దుర్బుద్ధితో మద గర్వముతోడుగా అత్యంతకాముకుడాయెను. దాసీ పుత్రుడగు అతడు స్వభావసిద్ధముగ మదమాంసములు సేవించుచు విచ్చలవిడిగా ధనము ఖర్చు చేయుచు ఛండాల స్త్రీలవరకు చెడ్డ స్త్రీలనందరను అనుభవించుచుండెను. దొంగతనము చేయుచు స్త్రీలకొరకు డబ్బంతయు వ్యయముచేయుచు చివరకు తల్లియగు వైశ్య పత్నిని కూడ బలాత్కరించెను. స్త్రీలను తృప్తిపరచుటకు తోటలో పూలు కోయు వృత్తి నెపమున మంచి పూలను అపహరించుచుండెను. తోటమాలి కి తెలియకుండ రాజు వనములో పూలు మాయమగుట గమనించి తోటమాలి కావలి వారిని నియమించి వానిని పట్టుకొనబోగా అతడు కోసిన పూలతో సహా కంచె దూకి పారిపోవ నుంకించి క్రిందపడిపోయెను. చేతిలోని మంచిపూలు జారి క్రింద పడగా వానినోట అప్రయత్నముగా శివార్పణమస్తు యని పలికెను. ఆ రాత్రి ఒక వేశ్యయింట సుఖించి తెల్లవారిన యడల రాజభటులు గుర్తించి పట్టి శిక్షింతురు, మరణము నిశ్చయమని శంకించి తెల్లవారక ముందుగనే గ్రామము విడిచి పయనించి బిచ్చమెత్తి ఆకలి తీర్చుకొనుచు వెళ్ళి వెళ్ళి వింధ్య పర్వతములను చేరెను. అక్కడ ఎవరి సేవచేసినను తగినంత ఆహారము దొరుకనందున హిమాలయ పర్వతముల వరకు వెళ్ళెను. కొందరు వర్తకులు కేదార పర్వతమునకు వెళ్ళుట గమనించి వారితో కలిసి పగలు ప్రయాణము, రాత్రి సత్రములో నిద్రించుచుండగా ఒక సత్రమునందు ఆరాత్రి కేదారమునుండి కాశీకి వెళ్ళుచున్న ఒక బిక్షువును చూచి ఇతని వద్ద డబ్బు ఉండి ఉండవచ్చును అర్ధరాత్రమున మొత్తము కాజేయ తలచెను. అతనితో అయ్యా రండి మీపాద సేవ చేసెదనని నమ్మించి అతను నిదురించు సమయమున ఒక పామును చంపి దాని విషము ఆ బిక్షువు కమండలమున వేసెను. ఆ బిక్షువు కమండలములోని జలము ఆచమనము చేసి మరణించినచో అనాయాసముగ అతని డబ్బు తనకు చేరునని తలచెను. బిక్షువు అర్ధరాత్రమున లఘుశంకకై లేచి కమండలము తీసుకొను సమయమున నిండుగానున్న జలము కొంత తొణికి ప్రక్కనే యున్న దుర్ధరుని పాత్రలో పడి, అతడు చీకటిలో తెలియక ఒక స్థంభమును తట్టుకొని పడిపోయి కమండలములోని నీరంతయు ఒలికిన కారణమున లఘుశంక విరమించుకొని అతడు మరల నిద్రించెను. కొంతసేపటికి దుర్ధరుడు లేచి బిక్షువు మరణించకుండుచ గమనించి ఇతనిని లేపి నీరు త్రాగించవలెనని తలచి మొదట తన దప్పిక తీర్చుకొనుటకు తన పాత్రలోని నీర కొంత తాగెను. విషపూరతమగు ఆ నీరు త్రాగినందున అతడు వెంటనే మరణించెను. తెల్లవారి బిక్షువు లేచి దుర్ధరుడు మరణించుట తెలిసికొని అతని యోగ ప్రభావము వలన దుర్ధరుని జన్మ ప్రభృతి అతని విషయమంతను తెలిసికొని అతనిని మన్నించి తనకు కొద్ది సవ చేసినందున మానవత్వముతో అతనికి దహన సంస్కారమాచరించి బిక్షువు కాశీకి వెళ్ళిపోయెను.
యమ భటులు దుర్ధరుని కనీవినీ యెఱుగని బాధలకు గురిచేసి బాదుచు, తన్నుచు యమపురికి లాగుకొని వెళ్ళిరి. కోటి అర్బుద కల్పములవరకు వీనిని శిక్షింపతలచిరి. యముడు చిత్రగుప్తుని దుర్ధరుని చరిత్ర వినిపింపమనగా అతనికి లేశమాత్ర పుణ్యమునూ లేదని, ఎన్ని సార్లు చిట్టా నిశితముగా పరిశీలించిననూ అతను చేసిన మంచి కన్పించుట లేదని తెల్పెను. దుర్ధరుడు చివరి కాలమున బిక్షువుకు సేవచేసిన ప్రతిఫలముగా యమధర్మ రాజుకు తానే చిట్టా పరిశీలింప వలయునను తలంపుగల్గి ప్రత్యేక దీక్షతో చూడగా దుర్ధరుడు వేశ్య కిచ్చుటకు తోటలో పూలు దొంగిలించి కావలివారు వెంట బడగా కంచెదూకి పారిపోవుచు క్రిందబడిన సమయమున అతని చేతిలో పూలు జారి క్రింద పడినపుడు అతడు అప్రయత్నముగా "శివార్పణమస్తు" అనుటయు, కాంచీ పట్టణము అంతయూ శివలింగమయమగుటచే అతని చేతిలో నుండి జారిన పూలొక శివలింగముపై పడుటయు గోచరించగా యముడు దుర్ధరునితో, నీ జన్మకాలమున ఒక చిన్న పుణ్యము చేసి యుండుటచేత నీవు చేసిన పాతకములకు కోటి కల్పములు నీవు నరకమున యుండవలసి యున్నను ఆ చిన్న పుణ్య ఫలమును నీవు కోరినచో ముందుగానే అనుభవించుటకు సమ్మతింతుననెను. దానికి దుర్ధరుడు ఆశ్చర్యచకితుడై తను చేసిన పాపములను చింతించుచు మానవ జన్మనెత్తి ఒక్కమారయినను శివపూజ చేయకుంటిని నాకు ప్రారబ్దమెట్లున్న అట్లు ఆజ్ఞాపింపుడనెను. పుణ్య ఫలమెట్లుండునని తెలియగోరెను. దానికి యముడు శివార్పిత ఫలపుణ్యము స్వర్గమున నీకు మేనకతో సౌఖ్యమొసగును. ఆతర్వాత ఏమగునో నిత్యము జగదంబను సేవించు మేనకనడిగి తెలిసికొనమని దుర్ధరుని యముడు స్వర్గమున కంపెను.
మేనక దుర్ధరుని సాదరముగ ఆహ్వానించి అర్ఘ్యపాద్యములిచ్చి, గంధమాల్యాది వస్తు భూషణములతో శయ్యా సౌఖ్యమునిచ్చి ఆలింగనము చేసికొనెను. వీణా, వేణు నాదనములతో గాన నాట్యములతో అలరించెను. కాని దుర్ధనునిలో కలిగిన విచారము వలన నా స్థిరనివాసము నరకమే గనుక ఈ మేనకతో క్షణ భంగురమగు సుఖము వలన ప్రయోజనమేమియని అంతయూ చూచుచు మిన్నకుండెను. దానికి మేనక నాథా! మీదాసిని నేను. మీరు కోరిన విధముగా నా సౌఖ్యము ననుభవించుడు. మీరు సుఖించనిచో యమ ధర్మరాజు నన్ను కోపించును. మీరెందులకు దిగులుగాయున్నారు. మీరు కైలాసము చేరి సుఖించగల భాగ్యమున్నట్లు నా దివ్యదృష్ఠికి తెలియుచున్నది అని మేనక చెప్పిన మాటలకు దుర్ధరుడు, నేను పరమ పాపినైనను అప్రయత్నముగా ఒక్క పర్యాయము నా చేతి నుండి జారిన పుష్పమును శివార్పణమస్తు యని వాక్కుద్వారా ఉచ్ఛరించిన పుణ్యము నీవద్దకు చేర్చినది. నీవు శివ భక్తురాలవు. నాలో ఎట్టి సుఖ వాంఛ గల్గుటలేదు. నేను నీశరణు జొచ్చుచున్నాను. నన్ను తరింపజేయగోరుచున్నానని ప్రార్ధించెను. దుర్ధరుని దీనవచనములు విని మేనక, శరణాగతులను రక్షించుట కర్తవ్యమని శివాజ్ఞ కనుక ఇతనిని కాపాడకున్నచే నా శివ పార్వతుల భక్తి వ్యర్ధమగును. ఇతడు ఎంతటి దుష్టుడయినను, పుణ్యలేశమున సూర్యతనయుడగు యమునిచే పునరాలోచింప జేసి మహానరకానుభవమునకు ముందుగా నావద్దకు పంపబడెను. శివుని యడల చేసిన కొద్ది పుణ్యమయినను మహాపాతకముల నశింప జేయుననుటకు ఇది నిదర్శనము. ఇందు సందేహము లేదు. మేనకలో గల్గిన ఈ సంశయాత్మక శివభక్తి రహస్యమును ఒక్కమారయినను భక్తిపూర్వకముగ వినిన వారికి సకల కల్మష నివృత్తి గల్గి శివపదము ప్రాప్తించును.
శివభక్తాగ్రగణ్యులగు బ్రాహ్మణులారా వినుడు. దివోదాసు బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి వరములు పొంది కాశీ రాజయ్యెను. బ్రహ్మ అతనిపై ఏ దేవతల ప్రభావము లేకుండ తాను పృధ్విని తన స్వయంశక్తిచే రక్షించ గల్గునట్లు వరమొసంగెను. తర్వాత బ్రహ్మ దేవుడు దివోదాసుకు తానిచ్చిన వరమును తెల్పి, ప్రార్థించి శివుని మందరాచలము వెళ్ళవలసినదికా కోరెను. శివుడు తన భక్తుడగు బ్రహ్మ వరమును కాపాడుటకై సర్వదేవతలతో కూడ మందరాచలము చేరెను.
దివోదాసు పంచ భూతముల శక్తులను తాను కైవశము జేసికొని వేరు దేవతల ప్రభావము లేకుండ, తన తపోబలమున నిరాటంకముగ రాజ్యమేలుట సహించలేని పంచభూతములు అతనిచే ఎట్లయినను ధర్మలోపము జేయించుటకై ఈర్ష్యజెందిరి. పంచభూతములు వారి పనులను నిర్వర్తించకుండుట యోగముద్వారా గ్రహించిన దివోదాసు తన తపో, యోగ ప్రభావమున అందరు దేవతల కార్యములను తానే నిర్వర్తించుచు రాజ్య మేలెను. ఇది తెలిసికొనిన పురోహితులు, భృగుమహర్షి బ్రహ్మాండమున శి శక్తిలేని ప్రదేశముండదు. కాని కాశిలో దివోదాసు అట్టి శక్తిని నిరోధించుట అపరాధమని ఎంచి, అతనికి శుభము గల్గుటకై మంచి మాటలతో శివశక్తిలేనిచో నీవు ఎంతోకాలము రాజ్యము చేయలేవని తెల్పెను.
దివోదాసు నవ్వుచూ ఏదియునూ శాశ్వతము గాదు. పూర్వ జన్మమున నేను తపస్సు జేసి శివుని మెప్పిమచి అపూర్వ వరములచే భోగములందు విరక్తి జెందితిని. తపోబలమున పొందిన శక్తి వ్యర్ధము కానిదే జన్మ అంతము కాదు. కనుక నేను శివాపరాధముచే శక్తిహీనుడనై శివుని చేతరింపబడుటకై నా రాజ్య భంగమునకు శివుడెట్టి ప్రయత్నములు జేయునో తెలిసికొనుటకు ఇట్లు ప్రవర్తించుచుంటిననెను. శివునికి ప్రీతకరమైనది, విహారభూమి, ఆత్మ భూతమైనది అట్టి కాశీ వియోగమును భరించలేని శంకరుడు బ్రహ్మాది దేవతలతో చేరి మరల కాశీ చేరుటకు ఎట్టి ప్రయత్నములు చేయునో చూతమను కొనెను. శివుడు పరాశక్తితో ఆలోచన సాగించి, దివోదాసు స్వధర్మచారి, బ్రహ్మ వరము పొందిన బ్రాహ్మణ భక్తుడు. పూర్వ జన్మలో ఏకాంత భక్తితో నాపూజ సల్పి మహాయోగ విభూతి పొందినవాడు. అట్టివాడు నేను కాశీ వియోగము భరించలేనని తలిసియూ నన్ను కాశీనుండి దూరము చేసెనని విచారించగా, పరాశక్తి, నాథా! తెలియక చేసిననూ శివాపరాధము దావానలము వంటిది. ఇక తెలిసి చేయు యీదివోదాస శివాపరాధమున ఇతని శక్తి త్వరితముగ నశించి రాజ్య భ్రష్టుని చేయును. కనుక యోగినీ గణములు, ఆదిత్య, గణేశ, విఘ్నేశ,బ్రహ్మ, విష్ణు మూర్తుల ద్వారా కాశీలో ధర్మ విచ్ఛేదము చేయించి అతని శక్తిని హరింతు మనెను. శివుడు దేవి చెప్పిన విధముగ వారిని నియమించగా, శివుని హృదయమున తాపముద్భవించిన కారణమున దివోదాసు భోగము లన్నియూ క్షణకాలమున నశించెను.
మహావిష్ణువు బుద్ధరూపమున, ధర్మపురమయిన కాశీలో అధర్మమునకు చోటు కల్పించుటచే దివోదాసు ధర్మచ్యుతుడై రాజ్యమును వదలివేసెను. అతని గురువు భృగుమహర్షి అతనిచే ప్రాచీన మణి కర్ణికలో స్నానము చేయించి, కేదారనాధును పూజింపజేసి పాపరహితుడై శివధామము చేరునట్లు చేసెను. ఈ వృత్తాంతముంతయు విని, వామదేవుడు బ్రహ్మవేత్త యగు సనత్కుమారునిట్లు ప్రశ్నించిరి. ప్రభో! దివోదాసు క్రింతం జన్మలో ఏవరుగా నుండి అనితర సాధ్యమగు తపమాచరించి గొప్ప వరములు పొందిరో శలవిండనగా సనత్కుమారులిట్లు తెల్పిరి.
పూర్వకాలమున కాంచీ పురములో విప్ర ప్రసాదుడను పేర ఒక వర్తకుడు ధనికుడు, వేదవిజ్ఞుడు, దేవ బ్రాహ్మణ భక్తుడు, నిత్యము ఏకామ్రనాథ కామాక్షీ దేవులను ఉపాసించి గొప్ప పుణ్యము సంపాదించెను. అతడొక వేశ్వద్వార పుత్ర వంతుడాయెను. ఆ వేశ్యకు వేరు సంతానము లేనందున వారీబిడ్డను అతి గారాబముగా పెంచి కాలవశమున గతించిరి. అతని పేరు దుర్దవుడు. తండ్రి గతించిన తర్వాత ధనవంతుడగుటచే దుర్బుద్ధితో మద గర్వముతోడుగా అత్యంతకాముకుడాయెను. దాసీ పుత్రుడగు అతడు స్వభావసిద్ధముగ మదమాంసములు సేవించుచు విచ్చలవిడిగా ధనము ఖర్చు చేయుచు ఛండాల స్త్రీలవరకు చెడ్డ స్త్రీలనందరను అనుభవించుచుండెను. దొంగతనము చేయుచు స్త్రీలకొరకు డబ్బంతయు వ్యయముచేయుచు చివరకు తల్లియగు వైశ్య పత్నిని కూడ బలాత్కరించెను. స్త్రీలను తృప్తిపరచుటకు తోటలో పూలు కోయు వృత్తి నెపమున మంచి పూలను అపహరించుచుండెను. తోటమాలి కి తెలియకుండ రాజు వనములో పూలు మాయమగుట గమనించి తోటమాలి కావలి వారిని నియమించి వానిని పట్టుకొనబోగా అతడు కోసిన పూలతో సహా కంచె దూకి పారిపోవ నుంకించి క్రిందపడిపోయెను. చేతిలోని మంచిపూలు జారి క్రింద పడగా వానినోట అప్రయత్నముగా శివార్పణమస్తు యని పలికెను. ఆ రాత్రి ఒక వేశ్యయింట సుఖించి తెల్లవారిన యడల రాజభటులు గుర్తించి పట్టి శిక్షింతురు, మరణము నిశ్చయమని శంకించి తెల్లవారక ముందుగనే గ్రామము విడిచి పయనించి బిచ్చమెత్తి ఆకలి తీర్చుకొనుచు వెళ్ళి వెళ్ళి వింధ్య పర్వతములను చేరెను. అక్కడ ఎవరి సేవచేసినను తగినంత ఆహారము దొరుకనందున హిమాలయ పర్వతముల వరకు వెళ్ళెను. కొందరు వర్తకులు కేదార పర్వతమునకు వెళ్ళుట గమనించి వారితో కలిసి పగలు ప్రయాణము, రాత్రి సత్రములో నిద్రించుచుండగా ఒక సత్రమునందు ఆరాత్రి కేదారమునుండి కాశీకి వెళ్ళుచున్న ఒక బిక్షువును చూచి ఇతని వద్ద డబ్బు ఉండి ఉండవచ్చును అర్ధరాత్రమున మొత్తము కాజేయ తలచెను. అతనితో అయ్యా రండి మీపాద సేవ చేసెదనని నమ్మించి అతను నిదురించు సమయమున ఒక పామును చంపి దాని విషము ఆ బిక్షువు కమండలమున వేసెను. ఆ బిక్షువు కమండలములోని జలము ఆచమనము చేసి మరణించినచో అనాయాసముగ అతని డబ్బు తనకు చేరునని తలచెను. బిక్షువు అర్ధరాత్రమున లఘుశంకకై లేచి కమండలము తీసుకొను సమయమున నిండుగానున్న జలము కొంత తొణికి ప్రక్కనే యున్న దుర్ధరుని పాత్రలో పడి, అతడు చీకటిలో తెలియక ఒక స్థంభమును తట్టుకొని పడిపోయి కమండలములోని నీరంతయు ఒలికిన కారణమున లఘుశంక విరమించుకొని అతడు మరల నిద్రించెను. కొంతసేపటికి దుర్ధరుడు లేచి బిక్షువు మరణించకుండుచ గమనించి ఇతనిని లేపి నీరు త్రాగించవలెనని తలచి మొదట తన దప్పిక తీర్చుకొనుటకు తన పాత్రలోని నీర కొంత తాగెను. విషపూరతమగు ఆ నీరు త్రాగినందున అతడు వెంటనే మరణించెను. తెల్లవారి బిక్షువు లేచి దుర్ధరుడు మరణించుట తెలిసికొని అతని యోగ ప్రభావము వలన దుర్ధరుని జన్మ ప్రభృతి అతని విషయమంతను తెలిసికొని అతనిని మన్నించి తనకు కొద్ది సవ చేసినందున మానవత్వముతో అతనికి దహన సంస్కారమాచరించి బిక్షువు కాశీకి వెళ్ళిపోయెను.
యమ భటులు దుర్ధరుని కనీవినీ యెఱుగని బాధలకు గురిచేసి బాదుచు, తన్నుచు యమపురికి లాగుకొని వెళ్ళిరి. కోటి అర్బుద కల్పములవరకు వీనిని శిక్షింపతలచిరి. యముడు చిత్రగుప్తుని దుర్ధరుని చరిత్ర వినిపింపమనగా అతనికి లేశమాత్ర పుణ్యమునూ లేదని, ఎన్ని సార్లు చిట్టా నిశితముగా పరిశీలించిననూ అతను చేసిన మంచి కన్పించుట లేదని తెల్పెను. దుర్ధరుడు చివరి కాలమున బిక్షువుకు సేవచేసిన ప్రతిఫలముగా యమధర్మ రాజుకు తానే చిట్టా పరిశీలింప వలయునను తలంపుగల్గి ప్రత్యేక దీక్షతో చూడగా దుర్ధరుడు వేశ్య కిచ్చుటకు తోటలో పూలు దొంగిలించి కావలివారు వెంట బడగా కంచెదూకి పారిపోవుచు క్రిందబడిన సమయమున అతని చేతిలో పూలు జారి క్రింద పడినపుడు అతడు అప్రయత్నముగా "శివార్పణమస్తు" అనుటయు, కాంచీ పట్టణము అంతయూ శివలింగమయమగుటచే అతని చేతిలో నుండి జారిన పూలొక శివలింగముపై పడుటయు గోచరించగా యముడు దుర్ధరునితో, నీ జన్మకాలమున ఒక చిన్న పుణ్యము చేసి యుండుటచేత నీవు చేసిన పాతకములకు కోటి కల్పములు నీవు నరకమున యుండవలసి యున్నను ఆ చిన్న పుణ్య ఫలమును నీవు కోరినచో ముందుగానే అనుభవించుటకు సమ్మతింతుననెను. దానికి దుర్ధరుడు ఆశ్చర్యచకితుడై తను చేసిన పాపములను చింతించుచు మానవ జన్మనెత్తి ఒక్కమారయినను శివపూజ చేయకుంటిని నాకు ప్రారబ్దమెట్లున్న అట్లు ఆజ్ఞాపింపుడనెను. పుణ్య ఫలమెట్లుండునని తెలియగోరెను. దానికి యముడు శివార్పిత ఫలపుణ్యము స్వర్గమున నీకు మేనకతో సౌఖ్యమొసగును. ఆతర్వాత ఏమగునో నిత్యము జగదంబను సేవించు మేనకనడిగి తెలిసికొనమని దుర్ధరుని యముడు స్వర్గమున కంపెను.
మేనక దుర్ధరుని సాదరముగ ఆహ్వానించి అర్ఘ్యపాద్యములిచ్చి, గంధమాల్యాది వస్తు భూషణములతో శయ్యా సౌఖ్యమునిచ్చి ఆలింగనము చేసికొనెను. వీణా, వేణు నాదనములతో గాన నాట్యములతో అలరించెను. కాని దుర్ధనునిలో కలిగిన విచారము వలన నా స్థిరనివాసము నరకమే గనుక ఈ మేనకతో క్షణ భంగురమగు సుఖము వలన ప్రయోజనమేమియని అంతయూ చూచుచు మిన్నకుండెను. దానికి మేనక నాథా! మీదాసిని నేను. మీరు కోరిన విధముగా నా సౌఖ్యము ననుభవించుడు. మీరు సుఖించనిచో యమ ధర్మరాజు నన్ను కోపించును. మీరెందులకు దిగులుగాయున్నారు. మీరు కైలాసము చేరి సుఖించగల భాగ్యమున్నట్లు నా దివ్యదృష్ఠికి తెలియుచున్నది అని మేనక చెప్పిన మాటలకు దుర్ధరుడు, నేను పరమ పాపినైనను అప్రయత్నముగా ఒక్క పర్యాయము నా చేతి నుండి జారిన పుష్పమును శివార్పణమస్తు యని వాక్కుద్వారా ఉచ్ఛరించిన పుణ్యము నీవద్దకు చేర్చినది. నీవు శివ భక్తురాలవు. నాలో ఎట్టి సుఖ వాంఛ గల్గుటలేదు. నేను నీశరణు జొచ్చుచున్నాను. నన్ను తరింపజేయగోరుచున్నానని ప్రార్ధించెను. దుర్ధరుని దీనవచనములు విని మేనక, శరణాగతులను రక్షించుట కర్తవ్యమని శివాజ్ఞ కనుక ఇతనిని కాపాడకున్నచే నా శివ పార్వతుల భక్తి వ్యర్ధమగును. ఇతడు ఎంతటి దుష్టుడయినను, పుణ్యలేశమున సూర్యతనయుడగు యమునిచే పునరాలోచింప జేసి మహానరకానుభవమునకు ముందుగా నావద్దకు పంపబడెను. శివుని యడల చేసిన కొద్ది పుణ్యమయినను మహాపాతకముల నశింప జేయుననుటకు ఇది నిదర్శనము. ఇందు సందేహము లేదు. మేనకలో గల్గిన ఈ సంశయాత్మక శివభక్తి రహస్యమును ఒక్కమారయినను భక్తిపూర్వకముగ వినిన వారికి సకల కల్మష నివృత్తి గల్గి శివపదము ప్రాప్తించును.
Subscribe to:
Posts (Atom)