Tuesday, March 4, 2014

కాశీ హిందూ విశ్వవిద్యాలయం - 2014-15 విద్యా సంవత్సరం లో స్నాతక, స్నాతకోత్తర పాఠ్యక్రమాల్లో ప్రవేశానికి ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి



కాశీ హిందూ విశ్వవిద్యాలయం - 2014-15 విద్యా సంవత్సరం లో స్నాతక, స్నాతకోత్తర పాఠ్యక్రమాల్లో ప్రవేశానికి ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి

పండిత మదనమోహన మాలవీయా స్థాపించిన కాశీ హిందూ విశ్వవిద్యాలయం లో గ్రాడ్యుయేట్ మరియి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి గాను నోటిఫికేషను జారీ చేయబడినది. అప్లికేషన్లు ఆన్ లైన్ లో జమచేయవలసి ఉంటుంది. అప్లికేషన్లు జమచేయుటకు ఆఖరి తేదీ మార్చి 25, 2014. పూర్తి వివరాలకు మరియు అప్లికేషను జమచేయుటకు ఆన్ లైన్ ఎడ్రస్ www.bhuonline.in.

ప్రవేశపరీక్షలు మే మరియు జూన్ నెలలలో శని మరియు ఆదివారాల్లో ఉంటాయి. పరీక్షాకేంద్రాలు వారణాశి, న్యూ ఢిల్లీ, గోరఖ్ పూర్, చెన్నై, కోల్ కత్తా,  హైదరాబాదు లలో ఉన్నాయి.

కాశీ హిందూ విశ్వవిద్యాలయం 1916 లో స్థాపించబడింది. అందువల్ల 2016 లో 100 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది. ఈ విద్యాసంవత్సరంలో పీజీ కోర్సులలో చేరిన వారికి డిగ్రీలు విశ్వవిద్యాలయం 100 వ (శతాబ్ది సంవత్సరం) సంవత్సరంలో జరిగే కాన్వోకేషన్ లో ఇవ్వబడతాయి.

No comments:

Post a Comment