Sunday, April 19, 2009

23వ అధ్యాయము

మునులు సూతుని ఇట్లడిగిరి. తమరు సర్వజ్ఞులగు వ్యాస శిష్యులు. కనుక మీరు మీ గురువు ద్వారా వినివ విధముగా సనత్కుమారులు బ్రహ్మదేవునుండి ఎట్లు ఉత్పన్నమయిరి? ఎప్పుడునూ 5 సంవత్సరముల బాలకునివలె నుండుటెట్లు జరిగెను? సర్వజ్ఞులెట్లయిరి? తెల్పుడనగా, సూతుడుమునిబృందములకిట్లు తెల్పెను. పూర్వము అనవద్య తన పతియగు నాథశర్మనీవిషయముతో పాటుగా, వామదేవుని వృత్తాంతమునుగూడా అడుగగా నాథశర్మ ఇట్లు తెల్పిరి.

పూర్వము ఒక కల్పాంతము తర్వాత మరల కొత్త బ్రహ్మగారు సృష్ఠి చేయు నిమిత్తము 10 వేల సంపత్కరములు ఏకాగ్రమనస్కులై తపమాచరింపగా పరమేశ్వరుడు సంతృప్తిజెంది గంభీరనాదముతో వరము కోరుకొమ్మనిరి. బ్రహ్మదేవుడు శంకరునికి నమస్కరించి, పరమాత్మా! మూడు లోకముల సృష్ఠికొరకు మీ భక్తుల ద్వారా నేనాపని నిర్వర్తింతును. వారు నాకుమారులుగా నా కార్య సాధనకు సమర్ధులు, సర్వజ్ఞులు గావలయును అని ప్రార్థించిరి. శంకరులు పద్మాసనా! దుర్లభమగు వరము కోరితివి. కాని సృష్టి కార్య నిర్వహణ కొరకు నేను నాభక్తులను నిర్దేశింతునని తెల్పి విఘ్నేశ, వీరభద్ర, నందికేశ, కుమార, మహాకాలులను అయిదుగురను పిలిచి, సృష్ఠి కార్యము కొరకు బ్రహ్మ మిమ్ములను తన కుమారులుగా కోరుచున్నాడు. మీకుకూడ అట్టి కోరిక గలదేని జగద్వస్తారము చేయుడనగా, వారు పరమాత్మా తమ ఆజ్ఞ బలవత్తరమయినది గనుక మేము బ్రహ్మదేవుని కుమారులముగా వ్యవహరింతుము కాని సృష్ఠి విషయమున గాదు. బ్రహ్మ తలచినవెటనే మేము ఉద్భవింతుమనిరి. బ్రహ్మ సంతుష్టుడై సత్యలోకము చేరెను. పరమాత్మ అంతర్హితులైరి. వారైదుగురునూ అంతర్హితులైరి.

బ్రహ్మ సృష్ఠి జేయ తలంచినవాడై శివభక్తులను తలంచగా విఘ్నేశ్వరుడు సనకుని రూపమున బ్రహ్మ మనస్సునుండి ఉద్భవించెను. వీరభద్రుడు సనందునిగా, నందీశ్వరుడు సనాతనునిగా, కార్తికేయుడు సనత్కుమారునిగా, మహాగాలుడు సనత్సుజాతునిగాను 5 సంవత్సరముల బాలకులుగా బ్రహ్మ మానస పుత్రులుగా ఉద్భవించిరి. కాని సదా శివనామ స్మరణముతో వేరు భావము మనసున రానీయక, విరక్తులై నిత్య తృప్తులుగా నుండిరి. బ్రహ్మ వారిని చూచి పుత్రులారా! మీరు దేవ, మనుష్య, పశు, పక్ష్యాదులను పుత్ర, పౌత్ర, ప్రపౌత్ర సంతతిగా వర్థిల్లజేసి సృష్ఠికార్యము జేయుడని తెల్పగా వారు శివధ్యానపరులై మూగ, చెవిటివారుగా బదులు పల్కక మిన్నకుండిరి. బ్రహ్మ వారిని చూచి, వీరు సృష్ఠికి సహకరింపరని ఎంచి, మరల నూరు సంవత్సరములు తపమాచరించెను. కాని మానసిక తపోబలమున సృష్ఠి జరుపలేక ఎన్నోమార్లు తపమాచరించి విఫలులైరి. అపుడు దీర్ఘముగ ఆలోచించి మైధున సృష్ఠిద్వారా జగత్తును నింపివేసి సంసారిగా మారెను. సనకాదులు మహా మహిమాన్విత రుద్రగణములు. ఇందు నాల్గవ వారు సనత్కుమారులు కార్తికేయుని అంశగా ప్రసిద్ధులు. మూడు లోకములందుని వారి ప్రజ్ఞను తెలిసినవారు లేరు. వైరాగ్యము, బ్రహ్మనిష్ఠ ఎట్టిదో లోకమున చాటుటకు శివుడే ఈ రూపము దాల్చెనా యన్నట్లుందురు. ఎప్పటికిని 5 సంవత్సరముల బాలుని వలె స్వర్గ, మర్త్య, పాతాళ లోకములందును, బ్రహ్మ, విష్ణు, రుద్రలోకములందును వీరు ఎక్కడ సంచరించిననూ అడ్డువారు లేకపోగా అందరునూ వినమ్రులై నమస్కరింతురు. వీరి శాప ప్రభావమున విష్ణు ద్వారపాలకులు జయవిజయులు జగత్తునందు జన్మించి శాపావసానంతరమున ముక్తులై శివపదము పొందిరి. లోక సంరక్షణార్ధము వీరు మానసమందు పరమేశ్వరుని తలంచుచు మనోవేగమున సంచరింతురు. ఈ కథను విని అనవద్య తన ప్రాణనాధుడు నాథశర్మను ఇట్లడిగెను. స్వామీ విష్ణుద్వారపాలకులు శాపోపహారము తర్వాత శివపదము పొందుటేమి? యనగా నాథశర్మ, ప్రియా శివరహస్యమెఱిగిన వారికే ఈ విషయము తెలియును. వినుము.

తొల్లి విష్ణుమూర్తి శంకరుని ప్రార్థించి స్వామీ మీ ద్వారపాలకులు నన్ను రక్షించువారినిగా జేయుడని కోరగా శివుడు కరుణించి తన ద్వారపాలకులు సుభద్ర, భద్రలనువారిని పిలిచి మీరు విష్ణుమూర్తి ద్వారపాలకులుకండని ఆజ్ఞాపింపగా, వారు శివుని ప్రార్థించి స్వామీ మాకు మరల మీచరణ సేవాభ్గ్యమెప్పుడు? పరమాత్మా మీ ఆజ్ఞను ఉల్లంఘించిజాలము, మీ నిత్య దర్శన, సేవనువిడువజాలము. ఇట్టి సంకట స్థితిలోనున్న మమ్ము కరుణింపుడని వేడగా, శంకరులు మీరు ఒక కల్పకాలము విష్ణువున్నంతవరకు అతనిని సేవించుచుండగా నా అంశతో సలక సనందనులు మీకు శాపమిత్తురు. ఆవ్యాజమున మరల నావద్దకు చేరుదురని ఊరడించిరి. నాసేవక భక్తులను నేనెక్కడనియమించిననూ వారొక్క అంశతో మాత్రమే అక్కడకు వెళ్ళి చివరగా మరల నన్ను చేరుదురు. ఇట్లు బ్రహ్మ, విష్ణు, రుద్రులు కూడా నాచే సృష్ఠి, స్థితి, లయ కార్యములకు నియమింపబడి, ఒక అంశతో వెళ్లి ఆ కార్యక్రమముల కల్పాంతమున మరల వచ్చి నన్ను చేరుదురు. కనుక వారు నా అంశతో నాకును వారికినీ భేదము లేదని తెలిసికొనుడు. అట్లే మీరు కుమారముని శాపమున మూడు జన్మలకాలము నన్నే తలంచుచు చివరకు మరల నన్ను చేరగలరు. అని పంపగా వారు విష్ణు ద్వారపాలకులు జయ, విజయులుగా, దేవాసుర యుద్ధములందు విష్ణు భక్తులకు విష్ణువుకు విజయము చేకూర్చుచుండిరి.

ఒకపరి సనకాది మహర్షులు లోక సంచారముచేయుచు విష్ణులోకమునకు వచ్చిరి. అపుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతమున శివమహిమలను చెప్పుచుండిరి. ద్వారపాలకలగు జయ, విజయులు అనుమతి లేనిదేలోనికి వెళ్లరాదని సలకాదుల నడ్డగించిరి. అపుడు మునులు వారిని చూచి, ఊర్ధ్వ, అధో లోకములందెక్కడనూ మాకడ్డునిలుచు వారు లేరు. మీరు దేవ, మానవ, రాక్షస ప్రవృత్తులుగా మమ్ము నిలువరించిరి గనుక మీరు మూడు జన్మలలో అట్టి ప్రవృత్తులుగలవారగుదురని శపించిరి. ఇది గమనించిన లక్ష్మీ నారాయణులు వారే ద్వారము కడకు వచ్చి మునులను సాదరముగ ఆహ్వానించి అర్ఘ్య పాద్యములతో పూజించి స్తుతించుట చూసి జయ విజయులు తమ శాపోపసంహారమునకై వారిని ప్రార్థించిరి. మునులు యోచించి, తమ నోటి ద్వారా అట్టి వాక్యములు వచ్చుట శంభుని ఆజ్ఞగా తలంచి, విధి బలీయము గనుక మీరు మూడు జన్మలలో దైత్య, రాక్షస, మానవులుగా జన్మింతురు. శివ కృపచే మేము ఆ జన్మలలో మీకుమారులుగా ఉద్భవించి మిమ్ము ఉద్ధరింతుము. అని చెప్పి లక్ష్మీ నారాయణులము కూడ వారిని ఉద్ధరింపగోరిరి. అపుడు లక్ష్మీదేవి ఆలోచించి, పరమేశ్వరుని ఆజ్ఞ వలన నేను కూడా వీరిని ఉద్ధరించుటకు ప్రయత్నింతును. వీరి రెండవ జన్మలో వారిచే ఆశింపబడి విష్ణుమూర్తి ద్వారా వారిని ఉద్ధరింతుననెను. సనకాదులు జయ, విజయుల నూరడించి వెడలిపోయిరి.

శాప పర్యవసానమున వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశపులైరి. సనక మహర్షి హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదునిగా విష్ణువును ప్రార్థించగా, విష్ణుమూర్తి తన శక్తిచాలక శివుని ప్రార్థించెను. పరమాత్మ నృశింహరూపమున విష్ణువులో ప్రవేశించి హిరణ్యకశిపుని, వరాహరూపమున ప్రవేశించి హిరణ్యాక్షుని వధించి ఉద్ధరించిరి.

రెండవ జన్మలో వారు రావణ, కుంభకర్ణులైరి. లక్ష్మి సీతాదేవిగా రావణునిచే బంధింపబడి, విష్ణుమూర్తి రామావతారముతో రావణుని వధించుటకు అగస్త్యునిచే ఆదిత్య హృదయరూపమున శివుని ప్రార్థించి ఆ శక్తితో రెండవ జన్మలో రావణ కుంభకర్ణులను ఉద్ధరించిరి.

మూడవ జన్మలో భద్ర, సుభద్రులు ఒక అంశతో జయ విజయులుగా విష్ణు ద్వారపాలకులైరి. చివరకు కల్పాంతమున ఆ విష్ణువుతో సహా మరల శివపదము బొందిరి. (ఇక్కడ ఏదో తేడా వచ్చింది చూడగలరు ...)

సనకాదులు అనేక కోటి బ్రహ్మాండములు శివధ్యాన పరులై వేరొండు తలంపక శివజ్ఞానులయిరి. ఈ రహస్యము శివుడు పార్వతికిని, స్కందుడు నాథశర్మకును తెల్పిరి. నాథశర్మ అనవద్య కిట్లు తెల్పి శివ రహస్యము అత్యద్భుతము. సనకాదులు బ్రాహ్మ మానస పుత్రులైననూ అనన్య శివభక్తి పరాయణులు. శివ మహాత్మ్యము విచిత్రము. శివయోగుల లీలను కూడ విచిత్రములు

No comments:

Post a Comment