Saturday, September 16, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - మూడవ భాగము

పంచక్రోశీయాత్ర ఎప్పుడు చేయాలి?

మహాదేవ ఉవాచ
శ్లో॥ అశ్విన్యాదిషు మాసేషు త్రిషు పార్వతి సర్వదా
ప్రదక్షిణా కర్తవ్యా క్షేత్ర స్యాపాప కాంక్షిభిః
మాఘాది చతురోమాసాః ప్రోక్తా యాత్రా విధౌ నృణామ్ ॥
ఓ పార్వతి! ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసములందు పంచక్రోశ యాత్రను చేయుట మంచిది. (బ్ర. వై. పు., కాశీ రహస్యం)

శ్లో॥ యథా కథంచిత్ దేవేశి! పంచక్రోశ ప్రదక్షిణమ్
కుర్యాదేవ న మాసాది చింతయేద్ధర్మ కోవిదః
స ఏవ శుభదః కాలో యస్మిన్ శ్రద్ధోదయో భవేత్ ॥
శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధావంతులు నెలలతో నిమిత్తము లేకుండ ఎప్పుడైననూ పంచక్రోశ యాత్ర చేయవచ్చును.

గమనిక : కాశీవాసులగు ఆంధ్రులు సామాన్యముగ కార్తీక, ఫాల్గుణ మాసములందు పంచక్రోశ యాత్రను చేయుచున్నారు. అనగా దక్షిణాయణమునందొకసారి, ఉత్తరాయణమునందొకసారి చేయుచున్నారు.

క్షేత్ర సన్యాసుల కర్తవ్యము

శ్లో॥ విధిస్తు పూర్వమేవోక్తో నియమాదియుత స్తవ
ప్రదక్షిణాత్రయం తేషాం అవధారయ సువ్రతే ॥ (. పు.)
ఓ పార్వతీ! క్షేత్రమునందుండు సన్యాసులు అందరివలె విధి నియమములను పాటించుచు కాశీ ప్రదక్షిణను చేయవలెను. వారు మూడు పర్యాయములు ప్రదక్షిణను అవశ్యమాచరింపవలెను. అంతకంటె అధికముగ చేసినచో చాల మంచిది. మూడు సార్లకంటె తక్కువ కాకుండ శ్రద్ధ వహింపవలెను.

No comments:

Post a Comment