Saturday, September 16, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - ఐదవ భాగము

యాత్రయందు వాస విచారము

శివుడు పార్వతికి తెలిపిన విధి ఉత్తమమైనదిగా పురాణములందు పేర్కొనబడినది.
ఒకరోజు నుండి ఏడు రోజులవరకు పంచ క్రోశీ దర్శన యాత్ర చేయు విధానము కలదు.
  1. ఒకరోజు పంచక్రోశీ దర్శన యాత్రను శివరాత్రినాడు అనేకులు చేయుచున్నారు. ఈ యాత్రయందు రామేశ్వరము విశ్రామస్థానము.
  2. రెండు రాత్రుల పంచక్రోశయాత్రయందు భీమచండీ, రామేశ్వరములు విశ్రామ స్థానములు.
  3. మూడు రాత్రుల యాత్రయందు భీమచండీ, రామేశ్వరము, కపిలధారలు విశ్రామ స్థానములు.
  4. నాల్గు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, రామేశ్వరము, కపిలధారలు విశ్రామ స్థానములు.
  5. ఐదు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, రామేశ్వరము, శివపురము, కపిలధారలు విశ్రామ స్థానములు. ఆంధ్రులు ఈ పంచదిన యాత్రను చేయుచున్నారు.
  6. ఆరు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, సోమనాధ (లంగోటియా హనుమాన్), రామేశ్వరము, శివపురము, కపిలధారలు విశ్రామ స్థలములు.
  7. ఏడు రాత్రుల యాత్రయందు దుర్గాకుండ్, కర్దమేశ్వర, భీమచండీ, దేహలీ వినాయక, రామేశ్వరము, పాశపాణి వినాయక, కపిలధారలు విశ్రామ స్థానమలు.
గమనిక : వరుణా నదిని ఎట్టిపరిస్థితులందును దాటరాదు. రాజులు, వృద్ధులు, సుకుమారులగు బాలకులు వారికి అనుకూలమగు చోటులే విశ్రామ స్థానములు. క్షేత్ర సన్యాసులు సంకల్పించి పంచక్రోశీ దర్శనయాత్రను చేయరాదు. వారు నగర, వారాణసీ, మరియు వారాణసీ అంతర్గత యాత్రలన్నియు చేయవచ్చును.

No comments:

Post a Comment